మార్చి 7నుంచి ITB 2023: ఒమన్ లో 348 శాతం పెరిగిన పర్యాటకులు
- March 05, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ 2023 మార్చి 7 నుండి 9 వరకు జరుగనున్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (ITB 2023) లో పాల్గొంటుంది. ఒమానీ ప్రతినిధి బృందానికి హెరిటేజ్, టూరిజం మంత్రి సలీం మహ్మద్ అల్ మహ్రూకీ నాయకత్వం వహిస్తారు. ITB బెర్లిన్ ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక పరిశ్రమ ఫెయిర్. ఇది దేశాలు, పర్యాటక ప్రాంతాలు, టూర్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, ట్రావెల్ ఏజెంట్లు, బుకింగ్ ఏజెంట్లు, హోటళ్లను ఒకచోట చేర్చుతుంది. ITB బెర్లిన్ 2023లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పెవిలియన్ లో దేశంలోని పర్యాటక ఆకర్షణలు, ప్రత్యేకమైన సైట్లను ప్రదర్శిస్తుంది. హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ (MHT) సహకారంతో సంబంధిత సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాయి.
2022 టూరిజం శాఖ గణాంకాల ప్రకారం.. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ను డిసెంబర్ 2022 చివరి నాటికి దాదాపు 2.9 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. ఇది 2021 అదే కాలంతో పోలిస్తే 348.2 శాతం పెరుగడం గమనార్హం. 2022లో సుల్తానేట్ ఆఫ్ ఒమన్లో మొత్తం హోటల్ ఆదాయం OMR186 మిలియన్లకు చేరుకుందని డేటా తెలిపింది. 2021 నుండి 2023 వరకు పర్యాటక రంగంలో ఒమన్ OMR3 బిలియన్లను ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం OMR1.7 బిలియన్ల విలువైన పర్యాటకానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులలో పని జరుగుతోందని ఒమన్ పర్యాటక శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









