అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సౌదీ సంతాపం

- March 05, 2023 , by Maagulf
అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సౌదీ సంతాపం

జకార్తా : ఇండోనేషియాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం జకార్తాలోని ఉత్తరాన ఉన్న ఇంధన స్టేషన్‌లో సంభవించిన అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని  ఆకాంక్షించారు.

ఇండోనేషియా రాజధానిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంధన స్టేషన్‌లో మంటలు చెలరేగడంతో కనీసం 17 మంది మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డ విషయం తెలిసిందే. ఇండోనేషియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డుడుంగ్ అబ్దురాచ్‌మన్, రాష్ట్ర ఇంధన సంస్థ పెర్టమినాస్ (PERTM.UL) ద్వారా నిర్వహించబడుతున్న ఈ కేంద్రంలో రాత్రి 8:00 గంటలకు(స్థానిక కాలమానం) అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదానికి  కారణాన్ని గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని స్థానిక అధికారులు ప్రకటించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com