600 మందిని మోసం చేసిన ఇద్దరికి జైలుశిక్ష
- March 12, 2023
దుబాయ్: దేశం వెలుపల రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో పెట్టుబడి పేరుతో పెట్టుబడిదారుడికి 422,000 Dhలను మోసగించినందుకు ఇద్దరు అరబ్ వ్యక్తులను దోషులుగా నిర్ధారించారు. దుబాయ్ మిస్డిమినర్ కోర్టు వారికి ఒక నెల జైలు శిక్ష విధించింది. మోసపూరితంగా స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును అప్పీల్ కోర్టు కూడా సమర్థించింది.
పోలీసు రికార్డుల ప్రకారం.. ఒక పెట్టుబడిదారుడు దేశం వెలుపల ఒక ప్రాజెక్ట్ కోసం రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తనను మోసం చేశాడని పేర్కొన్నాడు. ఇద్దరు నిందితులు తాము రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వాహకులమని చెప్పడంతో తాను ఆస్తిని కొనుగోలు చేసేందుకు వీలుగా వారిని సంప్రదించానని చెప్పారు. అతను టర్కీలో ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని వారు సూచించారు. దానికి అతను అంగీకరించాడు. అయితే, సదరు రియల్ కంపెనీ ఒప్పందం నిబంధనలను నెరవేర్చలేదు. ఆ వ్యక్తికి సమయానికి ఆస్తి హక్కును అందించలేదు. ఇద్దరు నిందితులు ఆస్తి విషయాన్ని వాయిదా వేయడంతో ఆ వ్యక్తి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఆ రియల్ కంపెనీ నకిలీదని తేలింది. ఇది యూఏఈ అంతటా కార్యాలయాలను ఏర్పాటు చేసిందని, దేశం వెలుపల కల్పిత ప్రాజెక్టులను ప్రోత్సహించే సంస్థగా అనేక వార్తాపత్రికలలో ప్రకటనలను కూడా ఇచ్చి పెట్టుబడిదారులను మోసం చేసిందని పోలీసులు గుర్తించారు. నిందితులు నకిలీ కంపెనీ ద్వారా సుమారు 600 మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లు విచారణ సందర్భంగా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్దనుంచి 300 మిలియన్ దిర్హామ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







