600 మందిని మోసం చేసిన ఇద్దరికి జైలుశిక్ష
- March 12, 2023
దుబాయ్: దేశం వెలుపల రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో పెట్టుబడి పేరుతో పెట్టుబడిదారుడికి 422,000 Dhలను మోసగించినందుకు ఇద్దరు అరబ్ వ్యక్తులను దోషులుగా నిర్ధారించారు. దుబాయ్ మిస్డిమినర్ కోర్టు వారికి ఒక నెల జైలు శిక్ష విధించింది. మోసపూరితంగా స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును అప్పీల్ కోర్టు కూడా సమర్థించింది.
పోలీసు రికార్డుల ప్రకారం.. ఒక పెట్టుబడిదారుడు దేశం వెలుపల ఒక ప్రాజెక్ట్ కోసం రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తనను మోసం చేశాడని పేర్కొన్నాడు. ఇద్దరు నిందితులు తాము రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వాహకులమని చెప్పడంతో తాను ఆస్తిని కొనుగోలు చేసేందుకు వీలుగా వారిని సంప్రదించానని చెప్పారు. అతను టర్కీలో ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని వారు సూచించారు. దానికి అతను అంగీకరించాడు. అయితే, సదరు రియల్ కంపెనీ ఒప్పందం నిబంధనలను నెరవేర్చలేదు. ఆ వ్యక్తికి సమయానికి ఆస్తి హక్కును అందించలేదు. ఇద్దరు నిందితులు ఆస్తి విషయాన్ని వాయిదా వేయడంతో ఆ వ్యక్తి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఆ రియల్ కంపెనీ నకిలీదని తేలింది. ఇది యూఏఈ అంతటా కార్యాలయాలను ఏర్పాటు చేసిందని, దేశం వెలుపల కల్పిత ప్రాజెక్టులను ప్రోత్సహించే సంస్థగా అనేక వార్తాపత్రికలలో ప్రకటనలను కూడా ఇచ్చి పెట్టుబడిదారులను మోసం చేసిందని పోలీసులు గుర్తించారు. నిందితులు నకిలీ కంపెనీ ద్వారా సుమారు 600 మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లు విచారణ సందర్భంగా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్దనుంచి 300 మిలియన్ దిర్హామ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







