600 మందిని మోసం చేసిన ఇద్దరికి జైలుశిక్ష
- March 12, 2023
దుబాయ్: దేశం వెలుపల రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో పెట్టుబడి పేరుతో పెట్టుబడిదారుడికి 422,000 Dhలను మోసగించినందుకు ఇద్దరు అరబ్ వ్యక్తులను దోషులుగా నిర్ధారించారు. దుబాయ్ మిస్డిమినర్ కోర్టు వారికి ఒక నెల జైలు శిక్ష విధించింది. మోసపూరితంగా స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును అప్పీల్ కోర్టు కూడా సమర్థించింది.
పోలీసు రికార్డుల ప్రకారం.. ఒక పెట్టుబడిదారుడు దేశం వెలుపల ఒక ప్రాజెక్ట్ కోసం రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తనను మోసం చేశాడని పేర్కొన్నాడు. ఇద్దరు నిందితులు తాము రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వాహకులమని చెప్పడంతో తాను ఆస్తిని కొనుగోలు చేసేందుకు వీలుగా వారిని సంప్రదించానని చెప్పారు. అతను టర్కీలో ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని వారు సూచించారు. దానికి అతను అంగీకరించాడు. అయితే, సదరు రియల్ కంపెనీ ఒప్పందం నిబంధనలను నెరవేర్చలేదు. ఆ వ్యక్తికి సమయానికి ఆస్తి హక్కును అందించలేదు. ఇద్దరు నిందితులు ఆస్తి విషయాన్ని వాయిదా వేయడంతో ఆ వ్యక్తి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఆ రియల్ కంపెనీ నకిలీదని తేలింది. ఇది యూఏఈ అంతటా కార్యాలయాలను ఏర్పాటు చేసిందని, దేశం వెలుపల కల్పిత ప్రాజెక్టులను ప్రోత్సహించే సంస్థగా అనేక వార్తాపత్రికలలో ప్రకటనలను కూడా ఇచ్చి పెట్టుబడిదారులను మోసం చేసిందని పోలీసులు గుర్తించారు. నిందితులు నకిలీ కంపెనీ ద్వారా సుమారు 600 మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లు విచారణ సందర్భంగా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్దనుంచి 300 మిలియన్ దిర్హామ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









