ఒత్తిడికి దూరంగా వుండాలంటే వీటికీ దూరంగా వుండాలి సుమా.!
- March 12, 2023ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరినీ వేధిస్తున్న సమస్య ఒత్తిడి. రకరకాల సమస్యలు, మారిన జీవన శైలి.. తదితర అంశాలను ఒత్తిడిని ప్రభావితం చేస్తున్నాయ్. దీని నుంచి తప్పించుకునేందుకు డైట్లో కొన్ని ఆహార పదార్ధాలను మినహాయిస్తే సరిపోతుంది.
ఒత్తిడితో బాధపడుతున్న వారు ఉప్పు తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉప్పు మానసిక ఉల్లాసాన్ని దెబ్బ తీస్తుంది. తొందరగా అలసిపోయేలా చేస్తుంది. ఉప్పు ఎక్కువగా వుండే ప్రాసెస్డ్ ఫుడ్, నిల్వ పచ్చళ్లు, అప్పడాలు తదితర ఆహార పదార్ధాలకు దూరంగా వుంటే మంచిది.
తీపి పదార్ధాలు శక్తి స్థాయిని ప్రభావితం చేస్తాయి. శరీర అసమతుల్యతకు దారి తీస్తుంది. తద్వారా టెన్షన్ ఎక్కువై డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదం వుంది. సో, చక్కెర పదార్ధాలను ఒత్తిడిలో వున్నప్పుడు అస్సలు తినకూడదని ఓ సర్వే ద్వారా తేలింది.
ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిందే. ఒత్తిడిలో వున్నప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటుంటారు కొందరు. కానీ, అది చాలా చాలా ప్రమాదకరం. మెదడులోని సెరోటోనిన్ చర్యను ఆల్కహాల్ నియంత్రిస్తుంది. తద్వారా మరింత ఆందోళన పెరుగుతుంది.
అలాగే కెఫిన్ కలిగిన పానీయాలను కూడా డిప్రెషన్లో వున్నప్పుడు అవైడ్ చేయాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన