ఒత్తిడికి దూరంగా వుండాలంటే వీటికీ దూరంగా వుండాలి సుమా.!
- March 12, 2023
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరినీ వేధిస్తున్న సమస్య ఒత్తిడి. రకరకాల సమస్యలు, మారిన జీవన శైలి.. తదితర అంశాలను ఒత్తిడిని ప్రభావితం చేస్తున్నాయ్. దీని నుంచి తప్పించుకునేందుకు డైట్లో కొన్ని ఆహార పదార్ధాలను మినహాయిస్తే సరిపోతుంది.
ఒత్తిడితో బాధపడుతున్న వారు ఉప్పు తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉప్పు మానసిక ఉల్లాసాన్ని దెబ్బ తీస్తుంది. తొందరగా అలసిపోయేలా చేస్తుంది. ఉప్పు ఎక్కువగా వుండే ప్రాసెస్డ్ ఫుడ్, నిల్వ పచ్చళ్లు, అప్పడాలు తదితర ఆహార పదార్ధాలకు దూరంగా వుంటే మంచిది.
తీపి పదార్ధాలు శక్తి స్థాయిని ప్రభావితం చేస్తాయి. శరీర అసమతుల్యతకు దారి తీస్తుంది. తద్వారా టెన్షన్ ఎక్కువై డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదం వుంది. సో, చక్కెర పదార్ధాలను ఒత్తిడిలో వున్నప్పుడు అస్సలు తినకూడదని ఓ సర్వే ద్వారా తేలింది.
ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిందే. ఒత్తిడిలో వున్నప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటుంటారు కొందరు. కానీ, అది చాలా చాలా ప్రమాదకరం. మెదడులోని సెరోటోనిన్ చర్యను ఆల్కహాల్ నియంత్రిస్తుంది. తద్వారా మరింత ఆందోళన పెరుగుతుంది.
అలాగే కెఫిన్ కలిగిన పానీయాలను కూడా డిప్రెషన్లో వున్నప్పుడు అవైడ్ చేయాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







