మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్
- March 14, 2023
అమరావతి: ఏపీ సీఎం జగన్..మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే మంత్రి పదవి నుంచి తప్పిస్తానని సీఎం హెచ్చరించారు. మంగళవారం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. సచివాలయంలోని మొదటి బ్లాక్లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం కొనసాగింది.
ఈ సమావేశంలో సీఎం జగన్, మంత్రులతో కీలక అంశాలను ప్రస్తావించారు. జులై నుంచి విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని తెలిపారు. 7 స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గెలవాలన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే మంత్రి పదవి నుంచి తప్పిస్తానని సీఎం హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. గత నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశామో.. అసెంబ్లీ వేదికగా అంశాలవారీగా మాట్లాడాలని మంత్రులకు తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025