స్కూల్ బస్సులో పిల్లల స్టక్ ప్రమాదాలకు చెక్!
- March 14, 2023
దోహా: గతేడాది స్కూల్ బస్సులో నాలుగేళ్ల చిన్నారి ఇరుక్కొని మరణించిన సంఘటనపై ఖతార్లోని కమ్యూనిటీలు సంతాపం వ్యక్తం చేస్తుండగా.. భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరుగకుండా ఎలా నివారించాలా అని దేశంలోని ఇద్దరు పాఠశాల విద్యార్థులు ఆలోచిస్తున్నారు. అల్ అండలస్ ప్రైమరీ గర్ల్స్ స్కూల్కు చెందిన రానా, మహా కలిసి స్కూల్ బస్సులోకి ప్రవేశించే.. బయటికి వచ్చే విద్యార్థులను లెక్కించే పరికరాన్ని కనిపెట్టారు. రియు ఏ సమయంలోనైనా బస్సులో ఉన్న వ్యక్తుల సంఖ్యను ఈ పరికరం ద్వారా తెలుసుకోచ్చు. KG-1 విద్యార్థి పాఠశాల బస్సులో ఊపిరాడక మరణించాడనే వార్తలను విన్నప్పుడు తమ మదిలో ఈ ఆలోచన వచ్చిందని మహా చెప్పారు. పిల్లవాడు బస్సులోకి ప్రవేశించినప్పుడు -నిష్క్రమించినప్పుడు బస్సు డోర్ వద్ద పెట్టిన పరికరం రికార్డ్ చేస్తుంది. పరికరంలో స్క్రీన్ అమర్చబడి ఉంది. ఇది బస్సులో ఉన్న వ్యక్తుల సంఖ్యను స్పష్టంగా చూపుతుంది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







