యంగ్ గ్లోబల్ లీడర్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సభ్యునిగా షేక్ మక్తూమ్
- March 15, 2023
యూఏఈ: దుబాయ్ ఉప పాలకుడు, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి, షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2023 యంగ్ గ్లోబల్ లీడర్స్ క్లాస్లో సభ్యునిగా ఎంపికయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కొత్తగా యంగ్ గ్లోబల్ లీడర్స్ క్లాస్లో దాదాపు 100 మంది ఆశాజనక రాజకీయ నాయకులు, వినూత్న పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలను కొత్తగా ఎంపిక చేసింది. ప్రతి సంవత్సరం ఫోరమ్ ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ పౌర సమాజం, కళలు, సంస్కృతి, ప్రభుత్వం, వ్యాపారంలో సానుకూల మార్పు కోసం కృషి చేసే 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన నాయకులను గుర్తించి ఎంపిక చేస్తుంది. 2004లో స్థాపించబడినప్పటి నుండి ఫోరమ్ ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి అత్యుత్తమ వ్యక్తుల విభిన్న కమ్యూనిటీని రూపొందించింది. షేక్ మక్తూమ్ను యంగ్ గ్లోబల్ లీడర్స్ క్లాస్ 2023లో చేర్చడం యువ నాయకులకు రోల్ మోడల్గా నిలుస్తుందని.. యూఏఈ, దుబాయ్లో అభివృద్ధిని పురోగమించడంలో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కొనియాడింది.
తాజా వార్తలు
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..







