వ్యాపిస్తున్న H3N2 వైరస్
- March 15, 2023న్యూ ఢిల్లీ: H3N2 వైరస్ వ్యాపిస్తుండటంతో పుదుచ్చేరిలో స్కూల్స్ మూసివేశారు. మార్చి 16నుంచి 10 రోజుల పాటు 1 నుంచి 8వ తరగతి విద్యార్ధులకు సెలవులను ప్రకటించింది పుదుచ్చేరి ప్రభుత్వం.ఇన్ఫ్లూఎంజా కేసుల సంఖ్య పెరగడంతో స్కూల్స్ ను మూసివేస్తున్నట్లు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ప్రకటించారు. భారత్ లో H3N2 వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. ఇది ఇన్ఫ్లూఎంజా A వైరస్ అని చెప్పారు. గత కొన్ని రోజులుగా వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన డేటా ప్రకారం... జనవరి 2 నుంచి మార్చి 5 వరకు భారత్ లో 451 కేసులు నమోదైనట్లు తెలిపారు.భారత్ లో మొదటి మరణం కర్ణాటకలోని హసన్ జిల్లాలో నమోదైంది. ఇప్పటివరకు ఏడుగురు ఈవైరస్ తో మరణించారని తెలిపారు. H3N2 యొక్క లక్షణాలు H3N2 యొక్క ఫ్లూ లక్షణాలలో శరీర నొప్పులు, చలి, జ్వరం, అలసట, అతిసారం, వాంతులు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారటం, తలనొప్పి ఉన్నాయి. రోగులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడేటప్పుడు వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వైద్య సమస్యలు ఉన్న వ్యక్తులు వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!