‘దసరా ‘ సెన్సార్ టాక్
- March 16, 2023
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ ‘దసరా’. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 30 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. రెండు గంటల ఇరవైతొమ్మిది నిమిషాల నిడివితో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు నేచురల్ లుక్ లో నాని ని చూసిన అభిమానులు..ఈ మూవీ ఊర మాస్ లుక్ లో కనిపించడమే కాదు యాక్టింగ్ కూడా అదే ఊర మాస్ గా ఉందని , ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుందని సెన్సార్ యూనిట్ చెప్పినట్లు తెలుస్తుంది.
మరోసారి కీర్తి సురేష్ తన యాక్టింగ్ తో ఆకట్టుకుందని, శ్రీకాంత్ కు ఇది మొదటి సినిమానే అయినప్పటికీ ఎన్నో సినిమాలు తీసిన నైపుణ్యం ఉన్న డైరెక్టర్ గా తెరకెక్కించాడని కితాబు ఇచ్చారు. సెన్సార్ యూనిట్ టాక్ తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ సంగీతం అందించారు. దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







