ఎక్కువ నీరు తీసుకున్నా ప్రమాదమే సుమా.!
- March 16, 2023
ఆరోగ్యంగా వుండాలంటే తగినంత నీరు త్రాగాల్సిందే అని వైద్యులు చెబుతుంటారు. కాలమేదైనా సరే, సరిపడినంత నీరు శరీరానికి అవసరం అని వైద్యులు సూచిస్తుంటారు.
అయితే, వైద్యుని సలహా మేరకు.. కొందరు సడెన్గా ఎక్కువ నీటిని తాగేయడం.. సడెన్గా తాగకుండా వుండిపోవడం వంటివి చేస్తుంటారు.
ఈ రెండూ ప్రమాదకరమే. అధిక నీరు తీసుకోవడం వల్ల మూత్ర పిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. నీటిని తీసుకుని శరీరంలోని వ్యర్ధాలను శుద్ధి చేయడమే మూత్ర పిండాలు చేసే పని. సరిపడా నీటిని తీసుకుంటే, ఆ మూత్రపిండాలి మెకానిజమ్ సవ్యంగా సాగుతుంది. అదే అధిక శాతంలో నీరు తీసుకోవడం వల్ల వాటిపై పని భారం పెరుగుతుంది.
అలాగే, అధికంగా నీటిని తీసుకోవడం.. తద్వారా మూత్రం సమస్య.. ఆపుకుంటే అదో బాధ.. పోవాలంటే ఇంకో బాధ.. తద్వారా కిడ్నీ సమస్యలు.. అందుకే తాగే నీటి మోతాదు విషయంలో కాస్త జాగ్రత్తలు పాఠించాలి సుమా.
శరీరంలో 70 శాతం నీరుంటుంది. మెదడులో 75శాతం, మూత్రపిండాల్లో 90 శాతం వుంటుంది. ఇది రక్తం (82 శాతం) కన్నా ఎక్కువే.
వైద్య సలహా ప్రకారం రోజుకు 8 నుంచి 10 గ్లాసులు.. అంటే రెండు లీటర్ల నీటిని మాత్రమే తీసుకోవాలని.. ఎండలో ఎక్కువ పని చేసే వారు ఎక్కువగా శారీరక శ్రమ చేసే వారు మాత్రం మరో రెండు గ్లాసులు ఎక్స్ట్రా తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







