ఎక్కువ నీరు తీసుకున్నా ప్రమాదమే సుమా.!
- March 16, 2023
ఆరోగ్యంగా వుండాలంటే తగినంత నీరు త్రాగాల్సిందే అని వైద్యులు చెబుతుంటారు. కాలమేదైనా సరే, సరిపడినంత నీరు శరీరానికి అవసరం అని వైద్యులు సూచిస్తుంటారు.
అయితే, వైద్యుని సలహా మేరకు.. కొందరు సడెన్గా ఎక్కువ నీటిని తాగేయడం.. సడెన్గా తాగకుండా వుండిపోవడం వంటివి చేస్తుంటారు.
ఈ రెండూ ప్రమాదకరమే. అధిక నీరు తీసుకోవడం వల్ల మూత్ర పిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. నీటిని తీసుకుని శరీరంలోని వ్యర్ధాలను శుద్ధి చేయడమే మూత్ర పిండాలు చేసే పని. సరిపడా నీటిని తీసుకుంటే, ఆ మూత్రపిండాలి మెకానిజమ్ సవ్యంగా సాగుతుంది. అదే అధిక శాతంలో నీరు తీసుకోవడం వల్ల వాటిపై పని భారం పెరుగుతుంది.
అలాగే, అధికంగా నీటిని తీసుకోవడం.. తద్వారా మూత్రం సమస్య.. ఆపుకుంటే అదో బాధ.. పోవాలంటే ఇంకో బాధ.. తద్వారా కిడ్నీ సమస్యలు.. అందుకే తాగే నీటి మోతాదు విషయంలో కాస్త జాగ్రత్తలు పాఠించాలి సుమా.
శరీరంలో 70 శాతం నీరుంటుంది. మెదడులో 75శాతం, మూత్రపిండాల్లో 90 శాతం వుంటుంది. ఇది రక్తం (82 శాతం) కన్నా ఎక్కువే.
వైద్య సలహా ప్రకారం రోజుకు 8 నుంచి 10 గ్లాసులు.. అంటే రెండు లీటర్ల నీటిని మాత్రమే తీసుకోవాలని.. ఎండలో ఎక్కువ పని చేసే వారు ఎక్కువగా శారీరక శ్రమ చేసే వారు మాత్రం మరో రెండు గ్లాసులు ఎక్స్ట్రా తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..