డబ్ల్యూహెచ్ఓ నేషనల్ ఇన్ఫ్లుయేంజా అవార్డును గెలుచుకున్న బహ్రెయిన్
- March 18, 2023
బహ్రెయిన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నేషనల్ ఇన్ఫ్లుయేంజా అవార్డును బహ్రెయిన్ గెలుచుకుంది. బహ్రెయిన్ నేషనల్ ఇన్ఫ్లుయేంజా సెంటర్ గత రెండు సంవత్సరాలుగా (2021-2022) సహకార కేంద్రాలతో ఇన్ఫ్లుయేంజా వైరస్ల మార్పిడి, నిఘా కార్యకలాపాలకు మద్దతుకు గుర్తింపుగా తూర్పు మధ్యధరా ప్రాంతానికి సంబంధించి ఈ అవార్డును గెలుచుకుంది. ఒమన్ సుల్తానేట్లో జరిగిన తూర్పు మధ్యధరా ప్రాంతంలోని అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సర్వైలెన్స్ నెట్వర్క్ సమావేశం ముగింపు సందర్భంగా అవార్డును ప్రకటించారు. 2011లో స్థాపించబడిన నేషనల్ ఇన్ఫ్లుయేంజా సెంటర్..2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఇన్ఫ్లుయేంజా సర్వైలెన్స్ అండ్ ఎక్స్పోర్ట్ (GISRS) కోసం గ్లోబల్ నెట్వర్క్లో సభ్యునిగా చేరి విస్తృతమైన పరిశోధనలు చేసింది.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









