నాసాలో సౌదీ వ్యోమగాములను కలిసిన ప్రిన్సెస్ రీమా
- March 23, 2023
వాషింగ్టన్ : యునైటెడ్ స్టేట్స్లోని సౌదీ రాయబారి ప్రిన్సెస్ రీమా బింట్ బందర్ హ్యూస్టన్లో సౌదీ వ్యోమగాములు రేయానా బర్నావి, అలీ అల్-కర్నీలను కలిశారు. అలీ, రేయానా లు తమ అంతరిక్ష యాత్రలో భాగంగా 11 శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారని, వారు Ax-2 స్పేస్ మిషన్ సిబ్బందితో కలిసి పాల్గొంటారని ఈ సందర్భంగా ప్రిన్సెస్ రీమా తెలిపారు. అంతకుముందు సౌదీ రాయబారి హ్యూస్టన్లోని నాసా జాన్సన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. మిషన్ కంట్రోల్ సెంటర్తో సహా అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. మొదటి అరబ్, ముస్లిం మహిళా వ్యోమగామి రయ్యానా బర్నావి అని ప్రిన్సెస్ రీమా గుర్తు చేశారు. సౌదీ అరేబియా 2023 రెండవ త్రైమాసికంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మొదటి సౌదీ మహిళా వ్యోమగామి రేయానా బర్నావి, సౌదీ పురుష వ్యోమగామి అలీ అల్-కర్నీని పంపుతున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







