నాసాలో సౌదీ వ్యోమగాములను కలిసిన ప్రిన్సెస్ రీమా
- March 23, 2023
వాషింగ్టన్ : యునైటెడ్ స్టేట్స్లోని సౌదీ రాయబారి ప్రిన్సెస్ రీమా బింట్ బందర్ హ్యూస్టన్లో సౌదీ వ్యోమగాములు రేయానా బర్నావి, అలీ అల్-కర్నీలను కలిశారు. అలీ, రేయానా లు తమ అంతరిక్ష యాత్రలో భాగంగా 11 శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారని, వారు Ax-2 స్పేస్ మిషన్ సిబ్బందితో కలిసి పాల్గొంటారని ఈ సందర్భంగా ప్రిన్సెస్ రీమా తెలిపారు. అంతకుముందు సౌదీ రాయబారి హ్యూస్టన్లోని నాసా జాన్సన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. మిషన్ కంట్రోల్ సెంటర్తో సహా అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. మొదటి అరబ్, ముస్లిం మహిళా వ్యోమగామి రయ్యానా బర్నావి అని ప్రిన్సెస్ రీమా గుర్తు చేశారు. సౌదీ అరేబియా 2023 రెండవ త్రైమాసికంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మొదటి సౌదీ మహిళా వ్యోమగామి రేయానా బర్నావి, సౌదీ పురుష వ్యోమగామి అలీ అల్-కర్నీని పంపుతున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







