దోహాలో ఘనంగా 'ఉగాది' వేడుకలు...
- March 23, 2023
దోహా: దోహా కతర్ తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం సాయంత్రం స్థానిక లయోల ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ నేతృత్వంలో ప్రవాసీ కుటుంబాలు మరియు కార్మికులు కలిసి ఆనందగా పండగ వేడుకల్లో పాల్గొన్నారు.
ఖండాంతరాల్లో ఉన్న తెలుగు సాంస్కృతి సంప్రదాయాలను మరవకుండా ప్రతి పండగను మరిచిపోకుండా భావితరాలకు పండగల విశిష్టతను తెలియజేసే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రజా సమితి -దోహా కతర్ ప్రతి పండగను ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడూ తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా జరపడానికి ముందుకొచ్చి తెలుగు చలనచిత్ర గాయని గాయకులను మరియు టెలివిజన్ రంగంలోని ప్రముఖ కళాకారులను ఆహ్వానించి ఆహూతులకు మధురానుభూతిని పంచింది తెలంగాణ ప్రజా సమితి కతర్.
పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందంగా పండగ జరుపుకున్నారు సుమారు 1000 మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ వేడుకల్ని తిలకించి సంప్రదాయ పండుగ సంబరాలను అతిథుల మద్య ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అతిథులందరిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానించి మన తెలుగు సంప్రదాయం ప్రకారంగా పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు తెలంగాణ ప్రజా సమితి కార్యవర్గ సభ్యులు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆహూతులను అలరించిన కళాకారులను అతిథులందరి సమక్షంలో తెలంగాణ ప్రజా సమితి కార్యవర్గ పక్షాన అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ గారి నేతృత్వంలో సన్మానించడం జరిగింది.ఈ వేడుకలు ప్రధాన కర్తగా వ్యవహరించిన తెలంగాణ పుడ్ స్టఫ్ అధినేత ప్రవీణ్ కుమార్ బుయ్యని కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించారు నిర్వాహకులు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)


తాజా వార్తలు
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!







