ఖతార్లో వింటర్ క్యాంపింగ్ సీజన్ ఏప్రిల్ 29 వరకు పొడిగింపు
- March 26, 2023
దోహా: దేశంలో ప్రస్తుత క్యాంపింగ్ సీజన్ను ఏప్రిల్ 29 వరకు పొడిగించనున్నట్లు పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో దక్షిణ ప్రాంతాలలో (సీలైన్, ఖోర్ అల్ ఉదీద్) క్యాంపింగ్ మే 20 వరకు కొనసాగుతుందని తెలిపింది. మంత్రిత్వ శాఖ యొక్క వింటర్ క్యాంపింగ్ వ్యవహారాల కమిటీ దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాలలో ప్రస్తుత సీజన్లో క్యాంపింగ్ వ్యవధిని ఏప్రిల్ 1కి బదులుగా ఏప్రిల్ 29 వరకు పొడిగించాలని నిర్ణయించింది. పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ డాక్టర్ ఫలేహ్ బిన్ నాసర్ అల్ థానీ ఆదేశాల మేరకు ఇది ఆధారపడి ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొక్కలు, చెట్లను నాటడం, క్యాంపింగ్ సైట్లను నిర్వహించడం, క్యాంపింగ్కు సంబంధించిన నియంత్రణలు- షరతులకు కట్టుబడి ఉండటం ద్వారా పర్యావరణాన్ని సంరక్షించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!







