ఖతార్లో వింటర్ క్యాంపింగ్ సీజన్ ఏప్రిల్ 29 వరకు పొడిగింపు
- March 26, 2023దోహా: దేశంలో ప్రస్తుత క్యాంపింగ్ సీజన్ను ఏప్రిల్ 29 వరకు పొడిగించనున్నట్లు పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో దక్షిణ ప్రాంతాలలో (సీలైన్, ఖోర్ అల్ ఉదీద్) క్యాంపింగ్ మే 20 వరకు కొనసాగుతుందని తెలిపింది. మంత్రిత్వ శాఖ యొక్క వింటర్ క్యాంపింగ్ వ్యవహారాల కమిటీ దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాలలో ప్రస్తుత సీజన్లో క్యాంపింగ్ వ్యవధిని ఏప్రిల్ 1కి బదులుగా ఏప్రిల్ 29 వరకు పొడిగించాలని నిర్ణయించింది. పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ డాక్టర్ ఫలేహ్ బిన్ నాసర్ అల్ థానీ ఆదేశాల మేరకు ఇది ఆధారపడి ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొక్కలు, చెట్లను నాటడం, క్యాంపింగ్ సైట్లను నిర్వహించడం, క్యాంపింగ్కు సంబంధించిన నియంత్రణలు- షరతులకు కట్టుబడి ఉండటం ద్వారా పర్యావరణాన్ని సంరక్షించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ