ఖైరాన్‌లో నీటమునిగి ఇద్దరు భారతీయులు మృతి

- March 26, 2023 , by Maagulf
ఖైరాన్‌లో నీటమునిగి ఇద్దరు భారతీయులు మృతి

కువైట్: ఖైరాన్‌లో ఇద్దరు భారతీయులు నీటిలో మునిగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల  ప్రకారం.. వారు ఖైరాన్ ప్రాంతంలో కయాకింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో వారు మరణించారు.  మృతులు కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన సుకేష్, పతనంతిట్టకు చెందిన జోసెఫ్ మత్తాయి (టిజో)గా గుర్తించారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వారిద్దరూ లులు ఎక్స్ఛేంజ్ కువైట్‌లో పనిచేస్తున్నారు. 44 ఏళ్ల సుకేష్ కార్పొరేట్ మేనేజర్‌గా పని చేస్తుండగా.. 29 ఏళ్ల టిజో అసిస్టెంట్‌ అకౌంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com