భారత్ లో భారీగా పెరిగిన కోవిడ్ కేసులు..
- March 26, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.గడిచిన 24 గంటల్లో దేశంలో 1,890 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఐదు నెలల తర్వాత.. అంటే 149 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. చివరగా గత అక్టోబర్ 28న 2,208 కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 9,433గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటిరవరకు 5,30,831 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో ఏడుగురు చనిపోయారు. మహారాష్ట్రలో ఇద్దరు, గుజరాత్లో ఇద్దరు, కేరళలో ముగ్గురు మరణించారు. తాజాగా నమోదైన కేసుల్లో ఢిల్లీ, ముంబై వాటా ఎక్కువగా ఉంది. ఢిల్లీలో శుక్రవారం 152 కరోనా కేసులు నమోదుకాగా, శనివారం 139 కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలో పాజిటివిటీ రేటు 4.98 శాతంగా ఉంది. మహారాష్ట్రలో శనివారం 437 కేసులు నమోదయ్యాయి. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.29 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.02శాతంగా, రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 4,47,04,147 కోవిడ్ కేసులు (4.47 కోట్లు) నమోదయ్యాయి. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,63,883. మరణాల శాతం 1.19 శాతం. దేశంలో ఇప్పటివరకు 220.65 కోట్ల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







