భారత్ లో భారీగా పెరిగిన కోవిడ్ కేసులు..
- March 26, 2023న్యూ ఢిల్లీ: భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.గడిచిన 24 గంటల్లో దేశంలో 1,890 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఐదు నెలల తర్వాత.. అంటే 149 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. చివరగా గత అక్టోబర్ 28న 2,208 కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 9,433గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటిరవరకు 5,30,831 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో ఏడుగురు చనిపోయారు. మహారాష్ట్రలో ఇద్దరు, గుజరాత్లో ఇద్దరు, కేరళలో ముగ్గురు మరణించారు. తాజాగా నమోదైన కేసుల్లో ఢిల్లీ, ముంబై వాటా ఎక్కువగా ఉంది. ఢిల్లీలో శుక్రవారం 152 కరోనా కేసులు నమోదుకాగా, శనివారం 139 కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలో పాజిటివిటీ రేటు 4.98 శాతంగా ఉంది. మహారాష్ట్రలో శనివారం 437 కేసులు నమోదయ్యాయి. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.29 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.02శాతంగా, రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 4,47,04,147 కోవిడ్ కేసులు (4.47 కోట్లు) నమోదయ్యాయి. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,63,883. మరణాల శాతం 1.19 శాతం. దేశంలో ఇప్పటివరకు 220.65 కోట్ల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..