డయాబెటిస్ రోగులకి ఈ ఆకులు ఓ ఔషధం.!
- March 27, 2023సీతాఫలం ఎంతో బలం అంటారు. అవును నిజమే బలమే కాదు, ఎంతో రుచికరం కూడా ఈ ఫలం. అయితే, ఈ పండులో అధిక మోతాదులో చక్కెర స్థాయిలు వుండడం వల్ల డయాబెటిస్ వున్న వాళ్లు ఈ పండుకు దూరంగా వుండమని సూచిస్తుంటారు.
అయితే, సీతా ఫలం.. పండు సంగతెలా వున్నా వీటి ఆకులు మాత్రం డయాబెటిక్ రోగులకు ఓ వరమే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
ఆయుర్వేదపరంగానే కాదు, వైద్య ప్రామాణికంగానూ ఈ ఆకులకు డయాబెటిస్ తగ్గించే శక్తి వుందని కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.
రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో వుంచడం ద్వారా డయాబెటిస్ని అదుపులో వుంచొచ్చు. సీతాఫలం ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నట్లు తాజా అధ్యయనాల్లో బయటపడింది. ఈ ఆకులను తినడం వల్ల ప్యాంక్రియాసిస్లో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో వుంటాయట.
సో, డయాబెటిక్ రోగులకు ఈ ఆకులు చాలా ఉపయోగకరమైనవిగా చెబుతున్నారు. రోజూ రెండు ఆకులను నమిలి తినడం వల్ల షుగర్ అదుపులో వుంటుందంటున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు