మొబైల్ వ్యాపారాలపై నియంత్రణకు కొత్త గైడ్ లైన్స్..!
- March 27, 2023
మస్కట్: మొబైల్ విక్రేతల వ్యాపార కార్యకలాపాలను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. మస్కట్ మునిసిపాలిటీ షరతులు, విధానాలకు కట్టుబడి, చట్టబద్ధమైన మరియు ఆరోగ్యకరమైన ఫ్రేమ్వర్క్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించాలని సూచించింది.
1- ఒమానీలు మాత్రమే ఈ వ్యాపారంలో ఉండాలి. మస్కట్ గవర్నరేట్ అంతటా ప్రవాస కార్మికులను నియమించుకోవడం నిషేధం.
2- మొబైల్ వెండింగ్ వ్యాపారంలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి.
3- ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పుడు లైసెన్స్ పొందిన విక్రేతలందరూ తప్పనిసరిగా నిర్దేశించిన ఆరోగ్య అవసరాలకు కట్టుబడి ఉండాలి.
మస్కట్ మునిసిపాలిటీ మొబైల్ వెండింగ్ వ్యాపారాలకు నిర్దేశిత సైట్లను తిరిగి కేటాయించే పనిలో ఉందని తెలిపింది. ‘‘లైసెన్స్ పొందిన మొబైల్ విక్రేతలు, వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MoCIIP) జారీ చేసిన మంత్రివర్గ నిర్ణయం నం. 241/2016లో నిర్దేశించిన ఆరోగ్య నియంత్రణలు, అవసరాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసిన తేదీనుంచి ఒక నెలలోపు పునరుద్ధరించాలి. ’’ అని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







