సౌదీలో విషాదం.. 20 మంది ఉమ్రా యాత్రికులు మృతి

- March 28, 2023 , by Maagulf
సౌదీలో విషాదం.. 20 మంది ఉమ్రా యాత్రికులు మృతి

సౌదీ: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాసిర్‌ గవర్నరేట్‌లోని అకాబా షార్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ఉమ్రా యాత్రికులు మృతి  చెందగా.. మరో 29 మంది ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందగానే రెడ్ క్రెసెంట్ బృందంతో సహా అత్యవసర సేవలు, ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే ఈ ఘోర దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com