ప్రముఖ రెస్టారెంట్ చైన్ వ్యవస్థాపకుడు కన్నుమూత
- March 28, 2023యూఏఈ: ప్రసిద్ధ అంతర్జాతీయ రెస్టారెంట్ చైన్ దిన్ తాయ్ ఫంగ్ను స్థాపించిన యాంగ్ బింగ్-యి.. 96 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది. మరణానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే అంత్యక్రియల ఏర్పాట్లు కొనసాగుతున్నందున కుటుంబ సభ్యులు గోప్యత కోరినట్లు కంపెనీ తెలిపింది. యాంగ్ బింగ్-యి విజయగాథ చాలా సంవత్సరాలుగా విస్తృతంగా ప్రచారంలో ఉంది. అతను 1947లో 20 సంవత్సరాల వయస్సులో కేవలం 20 డాలర్లు జేబులో పెట్టుకుని తైవాన్కు వెళ్లాడు. మొదట్లో తైవాన్లో వంట నూనెల వ్యాపారాన్ని స్థాపించడంతో ప్రారంభమైంది. మొదటగా తన భార్యతో కలిసి ఆవిరితో కూడిన చైనీస్ సూప్ కుడుములు లేదా జియావో లాంగ్ బావోను విక్రయించడం ప్రారంభించాడు. అనంతర కాలంలో యూఏఈ, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, సింగపూర్తో సహా ప్రపంచవ్యాప్తంగా తన రెస్టారెంట్ల చైన్ ను యాంగ్ బింగ్-యి విస్తరించారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం