హైదరాబాద్ లో 40 డిగ్రీలకు చేరుకోనున్న ఉష్ణోగ్రతలు..
- March 28, 2023
హైదరాబాద్: ఇటీవల కురిసిన వడగండ్ల వానను హైదరాబాద్ వాసులు ఫుల్ ఎంజాయ్ చేశారు. తాజాగా ఎండాకాలం ప్రతాపం చూపుతోంది. చల్లటి వాతావరణం కాస్తా మండుటెండగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఎండ దంచి కొడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వారంలోనే హైదరాబాద్ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
ఈ క్రమంలో ఒకటి, రెండు రోజుల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను తాకే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండలు జనాలకు ముచ్చెమటలు పట్టిస్తాయని పేర్కొంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలను పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







