హైదరాబాద్ లో 40 డిగ్రీలకు చేరుకోనున్న ఉష్ణోగ్రతలు..
- March 28, 2023హైదరాబాద్: ఇటీవల కురిసిన వడగండ్ల వానను హైదరాబాద్ వాసులు ఫుల్ ఎంజాయ్ చేశారు. తాజాగా ఎండాకాలం ప్రతాపం చూపుతోంది. చల్లటి వాతావరణం కాస్తా మండుటెండగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఎండ దంచి కొడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వారంలోనే హైదరాబాద్ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
ఈ క్రమంలో ఒకటి, రెండు రోజుల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను తాకే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండలు జనాలకు ముచ్చెమటలు పట్టిస్తాయని పేర్కొంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలను పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు