ఆ పత్రాలను ధ్వంసం చేస్తే.. Dh1 మిలియన్ జరిమానా, జైలు శిక్ష
- March 28, 2023యూఏఈ: పబ్లిక్, చారిత్రాత్మక, జాతీయ, ప్రైవేట్ పత్రాలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిన సందర్భాల్లో విధించే జరిమానా, జైలుశిక్ష గురించిన వివరాలను యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం తన సోషల్ మీడియా ఖాతాలలో ఒక పోస్ట్ పెట్టింది. నేషనల్ లైబ్రరీ, ఆర్కైవ్స్ సవరణలపై 2008 ఫెడరల్ లా నెం. (7)లోని ఆర్టికల్ నెం.25 ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఒక పత్రాన్ని నాశనం చేస్తే.. వారికి నిర్బంధ శిక్ష విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఎనిమిది నెలల జరిమానాతోపాటు Dh40,000 - Dh100,000 మధ్య జరిమానా లేదా ఈ రెండింటిని విధించే అవకాశం ఉందని వివరించింది. కీలక పత్రాలను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విధ్వంసం చేసినా, స్మగ్లింగ్ చేసినా, కాపీలు చేసినా లేదా బహిర్గతం చేసినా కనీసం ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష లేదా Dh50,000 - Dh 1,000,000 వరకు జరిమానా విధించబడుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!