అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- March 28, 2023
యూఏఈ: నివాసితులకు అదనపు ఆదాయాన్నిచ్చే సెకండ్ శాలరీ పథకాన్ని ప్రారంభించినట్లు నేషనల్ బాండ్స్ ప్రకటించింది. ఇది యూఏఈ జాతీయ, ప్రవాస జనాభా కోసం అనుబంధ ఆదాయాన్ని అందించే పొదుపు పథకమని తెలిపింది. యూఏఈలో ఉత్తమ పదవీ విరమణ ప్రణాళికలను అందించే లక్ష్యంతో దీర్ఘకాలిక ప్రోగ్రామ్లో ఈ ప్లాన్ మొదటి వరుసలో ఉంటుందని పేర్కొంది. ఈ ప్లాన్ రెండు ప్రధాన దశలను కలిగి ఉంటుందని.. మొదటిది "సేవింగ్" దశ అని ఇక్కడ కస్టమర్లు 3 - 10 సంవత్సరాల మధ్య వారు ఎంచుకున్న కాలానికి ప్రతి నెలా నేషనల్ బాండ్లలో డబ్బును పొదుపు చేయాలని తెలిపింది. తర్వాత "ఆదాయం" దశలో కస్టమర్ ప్రతి నెలా ఆదాయాన్ని పొందడం ప్రారంభించవచ్చని వెల్లడించింది.
ఉదాహరణకు, కస్టమర్లు 10 సంవత్సరాల పాటు నెలవారీ Dh5,000 ఆదా చేస్తే.. వారు తదుపరి 10 సంవత్సరాలకు నెలవారీ Dh7,500 అందుకోవచ్చు. అదే విధంగా, కస్టమర్లు 5 సంవత్సరాల పాటు నెలకు Dh5,000 ఆదా చేసుకుంటే, తదుపరి 3 సంవత్సరాల వ్యవధిలో రిడీమ్ చేసుకోవాలని ఎంచుకుంటే, వారు మూడు సంవత్సరాల పాటు నెలవారీ Dh10,020 మొత్తాన్ని ఇంటికి తీసుకెళ్లవచ్చని నేషనల్ బాండ్స్ వెల్లడించింది. రెండవ వేతనాన్ని ఎంచుకునే కస్టమర్లు కనీసం 3 సంవత్సరాల కాలానికి కనీసం నెలవారీ Dh1,000 పెట్టుబడి పెట్టాలి. సేవింగ్స్, జీతం మొత్తం, భవిష్యత్ అవసరాల ఆధారంగా కస్టమర్లు వారి రెండవ వేతన ప్రణాళికను రూపొందించవచ్చు. విద్య, ఇంటి కోసం డౌన్ పేమెంట్ లేదా పెట్టుబడుల కోసం వారి ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కస్టమర్లు తమ పొదుపులను నెలవారీ చెల్లింపులకు బదులుగా ఏకమొత్తంగా రీడీమ్ చేసుకోవడాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉందని నేషనల్ బాండ్స్ గ్రూప్ సీఈఓ మహ్మద్ ఖాసిమ్ అల్ అలీ తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









