మక్కా-మదీనా మధ్య 100కు పెరిగిన రైల్ సర్వీసులు

- March 29, 2023 , by Maagulf
మక్కా-మదీనా మధ్య 100కు పెరిగిన రైల్ సర్వీసులు

రియాద్ : హరమైన్ హై-స్పీడ్ రైల్వే మేనేజ్‌మెంట్ పవిత్ర రమదాన్ మాసంలో మక్కా - మదీనా మధ్య రోజువారీ రైలు ట్రిప్పుల సంఖ్యను 100కి పైగా పెంచింది. వార్షిక ఉమ్రా సీజన్‌లో ఉమ్రా యాత్రికులు, సందర్శకులు రెండు పవిత్ర నగరాల మధ్య ఇరువైపులా సజావుగా వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. రమదాన్ మాసంలో జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మదీనాలోని ప్రిన్స్ ముహమ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ద్వారా సౌదీ అరేబియాకు ఉమ్రా యాత్రికులు, సందర్శకులు భారీగా రావడంతో రైల్వే యాజమాన్యం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. హరమైన్ రైలులో మక్కాలోని గ్రాండ్ మస్జీదు, మదీనాలోని ప్రవక్త మస్జీదు నుండి సందర్శకులు,  యాత్రికులు పెరుగుతున్నారు. అలాగే ఐదు స్టేషన్ల ద్వారా జెడ్డా నగరం, కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీకి సందర్శకులు వస్తున్నారు.  మక్కా, మదీనాలను జెడ్డా, రబీగ్ మీదుగా కలిపే ఈ రైల్వే సర్వీసుల షెడ్యూల్‌లో 95 శాతం ఖచ్చితత్వాన్ని కొనసాగించడంతో ఇప్పటివరకు 25,000 కంటే ఎక్కువ ట్రిప్పులను నడిపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ సమయాల్లో మక్కా, మదీనా మధ్య గంటకు రెండు ట్రిప్పులు.. రద్దీ సమయాల్లో జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం , మక్కా స్టేషన్ మధ్య ప్రతి గంటకు ఒక ట్రిప్పు ఉంటుందని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com