తెలంగాణ: ఏప్రిల్ 25 నుండి విద్యాసంస్థలకు వేసవి సెలవులు
- March 29, 2023
హైదరాబాద్: విద్యాసంస్థలకు సంబంధించి వేసవి సెలవులు తేదీని ఖరారు చేసింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.
ఆరో తరగతి నుంచి ఎనమిదో తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న విద్యార్థుల పరీక్ష పత్రాలను ఏప్రిల్ 21 నుంచి 24 వరకు మూల్యాకణం చేసి మార్క్స్ ని ప్రకటిస్తారు. 25వ తేదీన పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి, విద్యార్థుల మార్కులను తల్లిదండ్రులకు తెలిపి, వేసవి సెలవులు ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







