తెలంగాణ: ఏప్రిల్ 25 నుండి విద్యాసంస్థలకు వేసవి సెలవులు
- March 29, 2023
హైదరాబాద్: విద్యాసంస్థలకు సంబంధించి వేసవి సెలవులు తేదీని ఖరారు చేసింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.
ఆరో తరగతి నుంచి ఎనమిదో తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న విద్యార్థుల పరీక్ష పత్రాలను ఏప్రిల్ 21 నుంచి 24 వరకు మూల్యాకణం చేసి మార్క్స్ ని ప్రకటిస్తారు. 25వ తేదీన పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి, విద్యార్థుల మార్కులను తల్లిదండ్రులకు తెలిపి, వేసవి సెలవులు ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









