ప్రధాని మోదీకి ఆస్కార్ అందించిన విజేతలు..
- March 30, 2023
న్యూ ఢిల్లీ: ఈ ఏడాది జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఇండియన్ సినిమాలు సత్తా చాటాయి. రెండు చిత్రాలు ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించాయి. 95వ ఆస్కార్ వేడుకలకు ఇండియా నుంచి మూడు చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. All That Breathes, The Elephant Whisperers, RRR చిత్రాలు ఫైనల్ నామినేషన్స్ నిలిచాయి. వీటిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రం బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో, ఆర్ఆర్ఆర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకొని విజేతలుగా నిలిచాయి. ఇప్పటి వరకు పలు ఇండియన్స్ కి ఆస్కార్ వచ్చినా అవేవి భారతీయ సినిమాలకు గాను వరించలేదు.
ఇండియన్ సినిమాకి ఆస్కార్ అందుకున్నది ఈ రెండు సినిమాలు మాత్రమే. దీంతో దేశంలోని ప్రతి ఒక్కరు ఈ రెండు టీమ్స్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కూడా ట్విట్టర్ వేదికగా అభినందించారు. తాజాగా ది ఎలిఫెంట్ విష్పరర్స్ టీం ప్రధాని మోదీని కలుసుకొని అయన చేతికి ఆస్కార్ ని అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మోదీ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ది ఎలిఫెంట్ విష్పరర్స్ తో ఆస్కార్ ని అందుకొని ప్రపంచ దృష్టిని, ప్రశంసలను పొందిన డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా ని కలిసే అవకాశం నాకు లభించింది. వీరిరుద్దరు భారతదేశం గర్వించేలా చేశారు” అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల తమిళనాడు సీఎం MK స్టాలిన్ ని కూడా కలిసి ఆయనకి ఆస్కార్ ని అందించారు. కాగా సీఎం స్టాలిన్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’లో కనిపించిన ఎలిఫెంట్ కేర్ టేకర్ బొమ్మన్ అండ్ బెల్లి దంపతులకు 2 లక్షల బహుమతి అందజేయడమే కాకుండా, వారిలా ఎలిఫెంట్ కేర్ క్యాంపు లో వర్క్ చేసే 91 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1 లక్ష ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు ఆ వర్కర్స్ కోసం యకో ఫ్రెండ్లీ హోమ్స్ నిర్మించేందుకు రూ.9.1 కోట్లు మంజూరు చేశారు. అలాగే యనమలై టైగర్ రిజర్వ్ ఏరియాలో, కోయంబత్తూరు చావడిలో కొత్త ఎలిఫెంట్ క్యాంపులు నిర్మించేందుకు 5, 8 కోట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







