ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్
- March 31, 2023
న్యూ ఢిల్లీ: దోమలు రాకుండా పెట్టిన మస్కిటో కాయిల్..ఏకంగా ఆరుగురి ప్రాణాలు తీసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకుంది. శాస్త్రిపార్క్లోని ఓ ఇంట్లో దోమలు రాకుండా మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోయారు. అది ఉన్నట్టుండి పరుపుపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని ఇల్లంతా వ్యాప్తి చెందాయి. ఆ మంటలకు వాళ్లకు ఊపిరాడలేదు. శ్వాస తీసుకోలేక కోమాలోకి వెళ్లిపోయి ప్రాణాలొదిలారు. ఆ కాయిల్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ కారణంగానే శ్వాస అందక చనిపోయారని వైద్యులు వెల్లడించారు.
'రాత్రి సమయంలో తలుపులు, కిటికీలు అన్ని మూసివేసి.. మస్కిటో కాయిల్స్ వెలిగించారు. పరుపుపై మస్కిటో కాయిల్ పడటంతో మంటలు చెలరేగాయి. మస్కిటో కాయిల్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడింది. ఈ విషపూరిత పొగతో కుటుంబంలోని వారంతా స్పృహ కోల్పోయారు. తర్వాత వారు ఊపిరాడక మరణించారు' అని సీనియర్ ఆఫీసర్ జోయ్ టిర్కే చెప్పారు. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారని వివరించారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







