పరీక్షల ఒత్తిడిని తట్టుకోవాలంటే పిల్లల డైట్లో ఈ మార్పులు తప్పనిసరి.!
- March 31, 2023పరీక్షల టైమ్ నడుస్తోంది. ఈ టైమ్లో పిల్లలు సహజంగానే ఆందోళన, ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో, తీవ్రమైన తలనొప్పి, జీర్ణక్రియ ఇబ్బందులు తదితర సమస్యలు తలెత్తుతాయ్.
ఆయా సమస్యల నుంచి పిల్లలను కాపాడేందుకు, సజావుగా వారు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆహారంలో ఈ పదార్ధాలను ఖచ్చితంగా వుండేలా చూసుకోవాలి.
గోధుమలతో చేసిన వంటకాలు తినిపించడం వల్ల నిస్సత్తువ, నీరసం తగ్గుతుంది. గోధుమలతో చేసిన వంటకాలు తినడం వల్ల కాస్త మందంగా అనిపిస్తుంది. కానీ, ఎక్కువ సమయం శరీరానికి శక్తి అందించడంలో ఇవి తోడ్పడతాయ్.
అలాగే, కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా వుండే, పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా అందించాలి. తాజా పండ్లు, కూరగాయలు కంపల్సరీ. అరటి పండు తినిపించడం మర్చిపోవద్దు. కాల్షియం ఎక్కువగా వుండే ఉడికించిన గుడ్డు పిల్లలను ఒత్తిడికి దూరం చేస్తుంది. సో, డైలీ ఓ గుడ్డు పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లల ఆరోగ్యానికి మంచిది సుమా. అలాగే మొలకెత్తిన గింజలు మెదడు పని తీరును ఆరోగ్యంగా వుంచి జ్ఞాపక శక్తిని పెంచుతాయ్.
« Older Article Three Emirati snowsport athletes to attend FIS Development Programme in Laax, Switzerland
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ