పరీక్షల ఒత్తిడిని తట్టుకోవాలంటే పిల్లల డైట్లో ఈ మార్పులు తప్పనిసరి.!
- March 31, 2023
పరీక్షల టైమ్ నడుస్తోంది. ఈ టైమ్లో పిల్లలు సహజంగానే ఆందోళన, ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో, తీవ్రమైన తలనొప్పి, జీర్ణక్రియ ఇబ్బందులు తదితర సమస్యలు తలెత్తుతాయ్.
ఆయా సమస్యల నుంచి పిల్లలను కాపాడేందుకు, సజావుగా వారు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆహారంలో ఈ పదార్ధాలను ఖచ్చితంగా వుండేలా చూసుకోవాలి.
గోధుమలతో చేసిన వంటకాలు తినిపించడం వల్ల నిస్సత్తువ, నీరసం తగ్గుతుంది. గోధుమలతో చేసిన వంటకాలు తినడం వల్ల కాస్త మందంగా అనిపిస్తుంది. కానీ, ఎక్కువ సమయం శరీరానికి శక్తి అందించడంలో ఇవి తోడ్పడతాయ్.
అలాగే, కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా వుండే, పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా అందించాలి. తాజా పండ్లు, కూరగాయలు కంపల్సరీ. అరటి పండు తినిపించడం మర్చిపోవద్దు. కాల్షియం ఎక్కువగా వుండే ఉడికించిన గుడ్డు పిల్లలను ఒత్తిడికి దూరం చేస్తుంది. సో, డైలీ ఓ గుడ్డు పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లల ఆరోగ్యానికి మంచిది సుమా. అలాగే మొలకెత్తిన గింజలు మెదడు పని తీరును ఆరోగ్యంగా వుంచి జ్ఞాపక శక్తిని పెంచుతాయ్.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









