రమదాన్: డెలివరీ రైడర్లకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్
- April 01, 2023
యూఏఈ: రమదాన్ మాసంలో ఉపవాసం ఉండే రైడర్లకు సౌకర్యవంతమైన పనిగంటలను ఆయా డెలివరీ కంపెనీలు కల్పిస్తున్నాయి. డెలివరీ రైడర్ ముహమ్మద్ బిలాల్ మాట్లాడుతూ.. సాధారణంగా రమదాన్ మాసంలో ఇఫ్తాల్ సమయంలో బిజీగా ఉంటుందన్నారు. అయితే సాయంత్రం 5.30 గంటల తర్వాత ఆహార పదార్థాలు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడతాయని, కానీ మగ్రిబ్ అజాన్ బయలుదేరడానికి 10 నిమిషాల ముందు, తాను సమీపంలోని మస్జీదుకు వెళ్లి ఇఫ్తార్ కోసం విరామం తీసుకుంటానని తెలిపారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత, తాను తిరిగి డ్యూటీలో చేరి డెలివరీ అందిస్తానని పేర్కొన్నారు. నివాసితులు ఇఫ్తార్ సమయంలో తమ ఆహారాన్ని ముందుగానే ఆర్డర్ చేయమని డెలివరీ కంపెనీలు కోరుతున్నాయి. లేదంటే ఫుడ్ డెలివరీలో జాప్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కాగా, చాలా కంపెనీలు ఈ సమయంలో ఉపవాసం ఉన్న రైడర్లకు మేలు చేసేందుకు డెలివరీలను నిలిపివేస్తున్నాయి. సాధారణంగా రమదాన్ సందర్భంగా ట్రాఫిక్ ప్రమాదాలు పెరుగుతాయని, రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనదారులు, పాదచారులు మరింత జాగ్రత్తగా ఉండాలని రోడ్డు భద్రతా నిపుణులు ప్రతి సంవత్సరం పిలుపునిస్తున్నారు. యూఏఈ రోడ్సేఫ్టీ రమదాన్ యాక్సిడెంట్ సర్వేల ప్రకారం.. పీక్ ప్రమాద సమయాలు ఇఫ్తార్కు ముందు (మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య), ఉదయం 8 నుండి 10 గంటల వరకు రద్దీ సమయంగా పేర్కొన్నారు. ఇఫ్తార్ సమయంలో అనేక మంది ప్రజలు వివిధ ప్రాంతాలకు బయలుదేరడంతో వాహనదారులు, డెలివరీ రైడర్లు ఈ సమయంలో జాగ్రత్తగా హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్.. ముడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- 2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు









