టోల్ ఛార్జ్ బాదుడు ఫై వాహనదారులు గగ్గోలు
- April 01, 2023
న్యూ ఢిల్లీ: ఈరోజు (ఏప్రిల్ 01) నుండి టోల్ చార్జీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ చార్జీల మోత ఫై వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. వాహనం స్థాయిని బట్టి 5 నుంచి 49 రూపాయల వరకు పెరిగింది టోల్ ఛార్జ్. నెలవారీ పాస్లపై 275 నుంచి 330 రూపాయల వరకు పెరిగాయి. జిల్లాల మీదుగా రాకపోకలు సాగించే వారికి సైతం టోల్ బాదుడు తప్పడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్ని కలిపే ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి, హైదరాబాద్-వరంగల్ 163వ నంబర్ జాతీయ రహదారి చాలా కీలకం. ఈ రెండు హైవేల మీద వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
గూడ్స్ వాహనాలపై కూడా బాదుడు షురూ కావడంతో లారీలు నడపలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు ఓనర్లు. అటు… పెరిగిన టోల్ భారాన్ని సీరియస్గా తీసుకుని ఆర్టీసీ ప్రయాణీకుడ్ని కూడా టార్గెట్ చేశాయి ప్రభుత్వాలు. టోల్ సేస్ పేరుతో భారీగా టికెట్ చార్జీలు వసూలు చేస్తోంది టీఎస్ ఆర్టీసి. APSRTC కూడా ప్రయాణికుల ఫై భారం మోపేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టోల్ ఛార్జ్ బాదుడు ప్రతి ఒక్కరి ఫై పడుతుంది. కూరగాయలు , నిత్యావసరాలు ఇలా అన్నింటిపై భారం పడబోతోంది. ఇప్పటికే అంన్నింటికీ ధరలు పెంచిన కేంద్రం..ఇప్పుడు టోల్ చార్జీలను సైతం పెంచడం ఫై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!