వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: సీపీ చౌహాన్
- April 01, 2023
హైదరాబాద్: తెలంగాణ సీనియర్ సిటిజన్స్ సంఘం వారు నిర్వహించిన సదస్సులో పాల్గొన్న రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్, మహిళలు, వృద్ధుల పట్ల అమానుషంగా వ్యవహరించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నో ఏళ్ళు బాధ్యత గల పౌరులుగా విభిన్న రంగాలలో సేవలందించి, దేశ అభ్యున్నతికి కారణమైన వృద్ధుల పట్ల అందరూ గౌరవ భావంతో ఉండాలని సూచించారు.తమ శ్రమతో, ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల పిల్లలు ప్రేమగా బాధ్యతతో ఉండాలని తెలిపారు. సమాజంలో వృద్ధాశ్రమాల అవసరం రాకూడదని అభిప్రాయపడ్డారు.
రాచకొండ పోలిస్ కమిషనరేట్ పరిధిలో వయో వృద్ధులు మరియు మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిల్లల చేతిలో హింసను, నిరాదరణ ఎదుర్కొంటూ పోలీస్ స్టేషన్ కు స్వయంగా రాలేని బాధితులు రాచకొండ వాట్సాప్ కంట్రోల్ రూమ్ 9490617111 నంబర్ కి గానీ, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేకూరుస్తామని ఈ సందర్బంగా కమిషనర్ తెలిపారు.
క్రైమ్ డీసీపి మధుకర్ స్వామి, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ సంఘ సభ్యులు మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







