వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: సీపీ చౌహాన్
- April 01, 2023
హైదరాబాద్: తెలంగాణ సీనియర్ సిటిజన్స్ సంఘం వారు నిర్వహించిన సదస్సులో పాల్గొన్న రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్, మహిళలు, వృద్ధుల పట్ల అమానుషంగా వ్యవహరించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నో ఏళ్ళు బాధ్యత గల పౌరులుగా విభిన్న రంగాలలో సేవలందించి, దేశ అభ్యున్నతికి కారణమైన వృద్ధుల పట్ల అందరూ గౌరవ భావంతో ఉండాలని సూచించారు.తమ శ్రమతో, ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల పిల్లలు ప్రేమగా బాధ్యతతో ఉండాలని తెలిపారు. సమాజంలో వృద్ధాశ్రమాల అవసరం రాకూడదని అభిప్రాయపడ్డారు.
రాచకొండ పోలిస్ కమిషనరేట్ పరిధిలో వయో వృద్ధులు మరియు మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిల్లల చేతిలో హింసను, నిరాదరణ ఎదుర్కొంటూ పోలీస్ స్టేషన్ కు స్వయంగా రాలేని బాధితులు రాచకొండ వాట్సాప్ కంట్రోల్ రూమ్ 9490617111 నంబర్ కి గానీ, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేకూరుస్తామని ఈ సందర్బంగా కమిషనర్ తెలిపారు.
క్రైమ్ డీసీపి మధుకర్ స్వామి, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ సంఘ సభ్యులు మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!