పిస్టల్స్ దొంగిలించిన ఐదుగురు వ్యక్తులకు జైలుశిక్ష

- April 02, 2023 , by Maagulf
పిస్టల్స్ దొంగిలించిన ఐదుగురు వ్యక్తులకు జైలుశిక్ష

మనామా: బహ్రెయిన్ మరణించిన వ్యాపారవేత్త ఇంటి నుండి పిస్టల్స్ దొంగిలించిన కేసులో  ఐదుగురు ఆసియా వ్యక్తులకు స్థానిక కోర్టు జైలు శిక్ష విధించారు.  విశ్వసనీయ సమాచారం మేరకు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి వారెంట్ పొంది నిందితుల ఇళ్ల నుంచి పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించారని, వారు 2013 లో మరణించిన ఒక వ్యాపారవేత్త ఇంటి నుండి పిస్టల్స్ దొంగిలించినట్లు తెలిపారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద మూడు పిస్టల్‌లు లభించగా, ఒకటి మూడో అమ్మినట్లు.. మరొకటి పాడుబడిన భవనంలో దాచిపెట్టారన్నారు.  నిందితులకు జరిపిన మెడికల్ టెస్టుల్లో డ్రగ్స్‌ పాజిటివ్‌గా తేలడంతో నిందితులపై డ్రగ్స్ సంబంధిత కేసులు కూడా నమోదు చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com