పిస్టల్స్ దొంగిలించిన ఐదుగురు వ్యక్తులకు జైలుశిక్ష
- April 02, 2023
మనామా: బహ్రెయిన్ మరణించిన వ్యాపారవేత్త ఇంటి నుండి పిస్టల్స్ దొంగిలించిన కేసులో ఐదుగురు ఆసియా వ్యక్తులకు స్థానిక కోర్టు జైలు శిక్ష విధించారు. విశ్వసనీయ సమాచారం మేరకు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి వారెంట్ పొంది నిందితుల ఇళ్ల నుంచి పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించారని, వారు 2013 లో మరణించిన ఒక వ్యాపారవేత్త ఇంటి నుండి పిస్టల్స్ దొంగిలించినట్లు తెలిపారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద మూడు పిస్టల్లు లభించగా, ఒకటి మూడో అమ్మినట్లు.. మరొకటి పాడుబడిన భవనంలో దాచిపెట్టారన్నారు. నిందితులకు జరిపిన మెడికల్ టెస్టుల్లో డ్రగ్స్ పాజిటివ్గా తేలడంతో నిందితులపై డ్రగ్స్ సంబంధిత కేసులు కూడా నమోదు చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..







