వారంలో మక్కా బస్సులను ఉపయోగించిన 1.9 మిలియన్ల మంది
- April 02, 2023
మక్కా: పవిత్ర రమదాన్ మాసం మొదటి వారంలో 1.9 మిలియన్లకు పైగా ప్రజలు మక్కా బస్సులను ఉపయోగించారని రాయల్ కమిషన్ ఫర్ మక్కా సిటీ అండ్ హోలీ సైట్స్ వెల్లడించింది. మక్కా బస్సుల సగటు రోజువారీ వినియోగం సుమారుగా 271,000 మంది వినియోగదారులు అని కమిషన్ పేర్కొంది. రోజువారీ ప్రయాణాల సగటు సంఖ్య సుమారుగా 4,400 ట్రిప్పుల కంటే ఎక్కువగా ఉందన్నారు. మొదటి వారంలోపు ట్రిప్పుల విషయానికొస్తే.. ఇది 12 లేన్ల ద్వారా 31,000 కంటే ఎక్కువ ట్రిప్పులకు చేరుకుందని తెలిపారు. ‘గెస్ట్స్ ఆఫ్ గాడ్ సర్వీస్ ప్రోగ్రామ్' కార్యక్రమాల్లో మక్కా బస్సుల ప్రాజెక్ట్ ఒకటి కావడం గమనార్హం. ఇది 438 స్టాప్ స్టేషన్లు, సెంట్రల్ ఏరియా, గ్రాండ్ మస్జీదును మక్కాలోని అనేక ముఖ్యమైన ప్రదేశాలతో కలుపుతూ 400 బస్సుల ద్వారా నిర్వహించబడుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







