వారంలో మక్కా బస్సులను ఉపయోగించిన 1.9 మిలియన్ల మంది
- April 02, 2023
మక్కా: పవిత్ర రమదాన్ మాసం మొదటి వారంలో 1.9 మిలియన్లకు పైగా ప్రజలు మక్కా బస్సులను ఉపయోగించారని రాయల్ కమిషన్ ఫర్ మక్కా సిటీ అండ్ హోలీ సైట్స్ వెల్లడించింది. మక్కా బస్సుల సగటు రోజువారీ వినియోగం సుమారుగా 271,000 మంది వినియోగదారులు అని కమిషన్ పేర్కొంది. రోజువారీ ప్రయాణాల సగటు సంఖ్య సుమారుగా 4,400 ట్రిప్పుల కంటే ఎక్కువగా ఉందన్నారు. మొదటి వారంలోపు ట్రిప్పుల విషయానికొస్తే.. ఇది 12 లేన్ల ద్వారా 31,000 కంటే ఎక్కువ ట్రిప్పులకు చేరుకుందని తెలిపారు. ‘గెస్ట్స్ ఆఫ్ గాడ్ సర్వీస్ ప్రోగ్రామ్' కార్యక్రమాల్లో మక్కా బస్సుల ప్రాజెక్ట్ ఒకటి కావడం గమనార్హం. ఇది 438 స్టాప్ స్టేషన్లు, సెంట్రల్ ఏరియా, గ్రాండ్ మస్జీదును మక్కాలోని అనేక ముఖ్యమైన ప్రదేశాలతో కలుపుతూ 400 బస్సుల ద్వారా నిర్వహించబడుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







