గాయాలతోనే విధులకు హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర... ఆరా తీసిన చంద్రబాబు
- May 07, 2016
టీడీపీ కీలక నేత, ఏపీ ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం రాత్రి తిరుపతి నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో గుంటూరు జిల్లా పరిధిలో ఆయన కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రవీంద్రతో పాటు మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన మంత్రి అనుచరులు ఆయనను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత రవీంద్ర విజయవాడ వచ్చేశారు. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కానీ కొల్లు రవీంద్ర మాత్రం ఆ దుర్ఘటన నుంచి క్షణాల్లో తేరుకున్నారు. నిన్న విజయవాడలో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడితో కలిసి హాజరయ్యారు. రవీంద్ర గాయపడ్డారన్న సమాచారంతో ఆయన కనిపించగానే చంద్రబాబు పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దీంతో ప్రమాదాన్ని చంద్రబాబుకు వివరించిన రవీంద్ర... తనకైన గాయాలు స్వల్పమైనవేనని చెప్పడమే కాకుండా వాటిని చంద్రబాబుకు చూపించారు. ఈ సందర్భంగా మిగిలిన మంత్రులు, టీడీపీ నేతలు కూడా రవీంద్రను పరామర్శించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి