సినిమా థియేటర్లలో మాస్క్ తప్పనిసరి చేసిన తమిళనాడు సర్కార్
- April 04, 2023
చెన్నై: భారత్ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడం తో కేంద్రం పలు రాష్ట్రాలకు ఆంక్షలు విధిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేసులు పెరుగుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. థియేటర్లతో పాటు ఆసుపత్రులకు వెళ్లే రోగులు, రోగుల బంధువులు కూడా మాస్క్ ధరించాలని సూచించింది.
ఈ సందర్బంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని తెలిపారు. అయితే, ముందుజాగ్రత్త చర్యగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, ఏసీ థియేటర్లు, ఆడిటోరియాలలో మాస్కులు ధరించాలని చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 59,512 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,641 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4.47 కోట్లకు (4,47,26,246) చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేల మార్క్ను దాటింది. ప్రస్తుతం 20,219 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 4.41 కోట్ల మంది (4,41,75,135) కోలుకున్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









