22 సంవత్సరాలుగా ఉపవాసం ఉంటున్న ముస్లిమేతరులు

- April 06, 2023 , by Maagulf
22 సంవత్సరాలుగా ఉపవాసం ఉంటున్న ముస్లిమేతరులు

యూఏఈ: ముస్లిమేతర యూఏఈ నివాసి ప్రవాస వినోద్ నంబియార్.. ముస్లిలకు సంఘీభావం తెలిపేందుకు గత 22 సంవత్సరాలుగా రమదాన్ మాసంలో ఉపవాసం ఉంటున్నారు. అతను భారతదేశంలోని మల్లాపురంలో (కేరళలోని తంజావూరు జిల్లాలోని ఒక గ్రామం) పని చేస్తున్నప్పటి నుంచి (2001)రమదాన్ మాసంలో ఉపవాస దీక్షను ప్రారంభించారు.  “మల్లాపురంలో ముస్లిం జనాభా అధికం. అప్పటికి రమదాన్ గురించి, దాని ప్రాముఖ్యత గురించి పెద్దగా తెలియదు.  ఉపవాసం ఉండే ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఏమీ తినరని మొదట్లో తెలియదని, రమదాన్ మాసం సందర్భంగా ప్రతిరోజూ గ్రామంలో ఆహారం కోసం వెతికేవాడిని. కానీ అక్కడ అంతా బంద్. కొందరు వ్యక్తులు నేను లంచ్ సమయంలో ఆకలితో ఉన్నానని గ్రహించారు. ఒక వ్యక్తి రమదాన్ సమయంలో నన్ను తన ఇంటికి ఆహ్వానించాడు. వారు ఉపవాసం ఉన్న సమయంలో నాకు ఆహారం అందించారు. కానీ నేను అక్కడికి వెళ్లాక మొత్తం కుటుంబం ఉపవాసం ఉందని గుర్తించాను. వాళ్ళు తిననప్పుడు నేను తినలేకపోయాను. కాబట్టి నేను ఆకలితో ఉండిపోయాను. ఆ తర్వాత తన ముస్లిం స్నేహితులతో కలిసి ఉపవాసం ఉండటం ప్రారంభించాను. ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. 2004లో యూఏఈకి వచ్చినా రమదాన్ మాసంలో ఉపవాసం ఉండటాన్ని వీడలేదు. యూఏఈ ఎక్స్ఛేంజ్‌తో పనిచేయడం ప్రారంభించాక నా భార్య కూడా నన్ను ఉపవాసం కొనసాగించమని ప్రోత్సహించింది. కంపెనీ CSR చొరవలో భాగంగా లేబర్ క్యాంపులలో పొగాకు వాడటం వల్ల కలిగే నష్టాల గురించి కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారు.  వారికి ఆర్థిక అక్షరాస్యత గురించి వివరిస్తాను. రమదాన్ సందర్భంగా, నా ఉపవాసాన్ని ముగించడానికి నేను ఎక్కువగా లేబర్ క్యాంపులను ఎంచుకుంటాను. నేను నా కార్యాలయ నిర్వహణను కూడా వీటిలో చాలా ప్రదేశాలకు తీసుకువెళతాను. జీవితంలో విభిన్నంగా పనులు చేయడానికి ప్రయత్నించాలని నేను గట్టిగా భావిస్తాను. ”అని భారతీయ ప్రవాసుడు నంబియార్ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com