భారత్ లో కొత్తగా 5335 కరోనా కేసులు నమోదు

- April 06, 2023 , by Maagulf
భారత్ లో కొత్తగా 5335 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: భారత్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,335 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు రోజుకంటే ఇది ఇరవై శాతం అధికం. గత ఏడాది సెప్టంబర్ తరువాత భారత్‌లో రోజువారి కేసుల సంఖ్య 5 వేల మార్కు దాటడం ఇదే తొలిసారి. కరోనా వ్యాప్తి తీవ్రతను సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 3.32గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా పేర్కొంది.

దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25,587గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.06 శాతం కాగా రివవరీ రేటు 98.75 శాతంగా ఉంది.ఇక గత 24 గంటల్లో 2826 మంది కరోనా నుంచి బయటపడ్డట్ట కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 4,41,82,538.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com