నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది:హోం మంత్రి మహమూద్ అలీ
- April 06, 2023
హైదరాబాద్: నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏ.సి.ఎస్ నగర్ లో రూ. 336 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 48 డబుల్ బెడ్ రూం ఇళ్లను గురువారం హోం మంత్రి డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 ప్రాంతాల్లో ఒక లక్ష గృహాలు నిర్మించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగా నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే రెండు పడకల గదుల నిర్మాణాలు చేపట్టి అందజేయడం జరుగుతుందని తెలిపారు. చేపట్టిన గృహ నిర్మాణ సముదాయాలలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు మాట్లాడుతూ... నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగా అందజేస్తున్నారని, డబుల్ బెడ్ రూం ఇళ్లు రాని వారు నిరాశ చెందవద్దని, ఇక్కడ స్థలం కొరత ఉన్నందున తక్కువ డబుల్ బెడ్ రూం లు నిర్మించడం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న వారికి బండ్లగూడ, జవహర్ నగర్, నాగోల్ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను రాని వారికి ఇస్తామని హామీ ఇచ్చారు. అడ్డగుట్ట బస్తీవాసుల కోరిక మేరకు ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబాలకు నిలువ నీడ కల్పించేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లో అర్హులైన వారందరికీ 2 BHK గృహాలను అందించడం జరుగుతుందని ఇప్పటి వరకు సుమారు 500 మంది కి అర్హులైనవారికి పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లింగాని ప్రసన్న లక్ష్మి, ఆర్. సునీత, సామల హేమ, హౌసింగ్ ఓ.ఎస్.డి సురేష్ కుమార్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం







