మార్బర్గ్ వైరస్: ఒమన్ వెళ్లే ప్రయాణికులకు ‘ఎమిరేట్స్’ హెచ్చరిక
- April 08, 2023
యూఏఈ: దుబాయ్ ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్.. మార్బర్గ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ ఆరోగ్యశాఖ నిర్దేశించిన ప్రయాణ మార్గదర్శకాల గురించి ప్రయాణికులకు హెచ్చరికను జారీ చేసింది. మార్బర్గ్ వైరస్ ప్రభావిత దేశాలైన రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, గినియా నుండి ఒమన్కు వెళ్లే ప్రయాణికులు క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. ప్రయాణం చేసిన 21 రోజులలోపు అనారోగ్యంగా అనిపిస్తే తక్షణ సహాయం తీసుకోవాలని తన అలెర్ట్ లో పేర్కొంది. మరోవైపు ఒమన్ ఆరోగ్య అధికారులు వైరస్ ప్రభావిత దేశాల పర్యటనలను వాయిదా వేసుకోవాలని, ప్రయాణం అత్యవసరమైతే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు సూచించింది. ఇదిలా ఉండగా.. దుబాయ్ - టాంజానియాలోని దార్ ఎస్ సలామ్ నగరాల మధ్య విమానాలు సాధారణ షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని విమానయాన సంస్థ ఎమిరేట్స్ తెలిపింది. ఇటీవల యూఏఈ కూడా మార్బర్గ్ వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లి వచ్చిన ప్రయాణికులకు ఇలాంటి హెచ్చరికలనే జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







