మార్బర్గ్ వైరస్: ఒమన్ వెళ్లే ప్రయాణికులకు ‘ఎమిరేట్స్’ హెచ్చరిక
- April 08, 2023
యూఏఈ: దుబాయ్ ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్.. మార్బర్గ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ ఆరోగ్యశాఖ నిర్దేశించిన ప్రయాణ మార్గదర్శకాల గురించి ప్రయాణికులకు హెచ్చరికను జారీ చేసింది. మార్బర్గ్ వైరస్ ప్రభావిత దేశాలైన రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, గినియా నుండి ఒమన్కు వెళ్లే ప్రయాణికులు క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. ప్రయాణం చేసిన 21 రోజులలోపు అనారోగ్యంగా అనిపిస్తే తక్షణ సహాయం తీసుకోవాలని తన అలెర్ట్ లో పేర్కొంది. మరోవైపు ఒమన్ ఆరోగ్య అధికారులు వైరస్ ప్రభావిత దేశాల పర్యటనలను వాయిదా వేసుకోవాలని, ప్రయాణం అత్యవసరమైతే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు సూచించింది. ఇదిలా ఉండగా.. దుబాయ్ - టాంజానియాలోని దార్ ఎస్ సలామ్ నగరాల మధ్య విమానాలు సాధారణ షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని విమానయాన సంస్థ ఎమిరేట్స్ తెలిపింది. ఇటీవల యూఏఈ కూడా మార్బర్గ్ వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లి వచ్చిన ప్రయాణికులకు ఇలాంటి హెచ్చరికలనే జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









