మార్బర్గ్ వైరస్: ఒమన్ వెళ్లే ప్రయాణికులకు ‘ఎమిరేట్స్’ హెచ్చరిక
- April 08, 2023
యూఏఈ: దుబాయ్ ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్.. మార్బర్గ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ ఆరోగ్యశాఖ నిర్దేశించిన ప్రయాణ మార్గదర్శకాల గురించి ప్రయాణికులకు హెచ్చరికను జారీ చేసింది. మార్బర్గ్ వైరస్ ప్రభావిత దేశాలైన రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, గినియా నుండి ఒమన్కు వెళ్లే ప్రయాణికులు క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. ప్రయాణం చేసిన 21 రోజులలోపు అనారోగ్యంగా అనిపిస్తే తక్షణ సహాయం తీసుకోవాలని తన అలెర్ట్ లో పేర్కొంది. మరోవైపు ఒమన్ ఆరోగ్య అధికారులు వైరస్ ప్రభావిత దేశాల పర్యటనలను వాయిదా వేసుకోవాలని, ప్రయాణం అత్యవసరమైతే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు సూచించింది. ఇదిలా ఉండగా.. దుబాయ్ - టాంజానియాలోని దార్ ఎస్ సలామ్ నగరాల మధ్య విమానాలు సాధారణ షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని విమానయాన సంస్థ ఎమిరేట్స్ తెలిపింది. ఇటీవల యూఏఈ కూడా మార్బర్గ్ వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లి వచ్చిన ప్రయాణికులకు ఇలాంటి హెచ్చరికలనే జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!







