మునిగిపోతున్న 15 మందిని రక్షించిన ఒమన్ నేవీ
- April 08, 2023
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లోని సముద్రంలో సాంకేతిక లోపంతో మునిగిపోతున్న పడవలో ఉన్న 15 మందిని ఒమన్ రాయల్ నేవీ రక్షించింది. ముసందమ్ గవర్నరేట్లో ఎనిమిది మంది పౌరులు, ఏడుగురు నివాసితులతో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన పడవను రక్షించినట్లు ఒమన్ రాయల్ నేవీ వెల్లడించింది. పడవలో సాంకేతిక లోపం ఏర్పడిందని, అది సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉందని సమాచారం అందగానే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొంది. ఖసాబ్ అని పిలువబడే ఈ పడవను ముసందమ్ గవర్నరేట్లోని ఉమ్ అల్-ఘనామ్ ద్వీపానికి దక్షిణం నుండి ఒక నాటికల్ మైలు దూరంలో గుర్తించిన ఒమన్ రాయల్ నేవీ.. దానిని రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ బోట్ సాయంతో ముసందమ్ నేవల్ బేస్కు తరలించారు.
తాజా వార్తలు
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం







