మునిగిపోతున్న 15 మందిని రక్షించిన ఒమన్ నేవీ
- April 08, 2023
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లోని సముద్రంలో సాంకేతిక లోపంతో మునిగిపోతున్న పడవలో ఉన్న 15 మందిని ఒమన్ రాయల్ నేవీ రక్షించింది. ముసందమ్ గవర్నరేట్లో ఎనిమిది మంది పౌరులు, ఏడుగురు నివాసితులతో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన పడవను రక్షించినట్లు ఒమన్ రాయల్ నేవీ వెల్లడించింది. పడవలో సాంకేతిక లోపం ఏర్పడిందని, అది సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉందని సమాచారం అందగానే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొంది. ఖసాబ్ అని పిలువబడే ఈ పడవను ముసందమ్ గవర్నరేట్లోని ఉమ్ అల్-ఘనామ్ ద్వీపానికి దక్షిణం నుండి ఒక నాటికల్ మైలు దూరంలో గుర్తించిన ఒమన్ రాయల్ నేవీ.. దానిని రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ బోట్ సాయంతో ముసందమ్ నేవల్ బేస్కు తరలించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









