ప్రత్యేక హోదాపై సంప్రదిపులు కొనసాగించాలని ఆదేశాలు--ఏ.పి ముఖ్యమంత్రి
- May 08, 2016
ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలపై నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో ఈరోజు మంత్రులు, తెదేపా ముఖ్యనేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం ఇప్పటివరకు ఏం ఇచ్చిందనే దానిపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. భాజపాతో ఎలా వ్యవహరించాలనే అంశంపై చర్చించారు. వైకాపా అధినేత జగన్ ఇక్కడ దీక్షలు చేస్తే లాభం ఉండదని... దిల్లీలో చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కళా వెంకట్రావు, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









