ప్రత్యేక హోదాపై సంప్రదిపులు కొనసాగించాలని ఆదేశాలు--ఏ.పి ముఖ్యమంత్రి

- May 08, 2016 , by Maagulf
ప్రత్యేక హోదాపై సంప్రదిపులు కొనసాగించాలని ఆదేశాలు--ఏ.పి ముఖ్యమంత్రి

ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలపై నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో ఈరోజు మంత్రులు, తెదేపా ముఖ్యనేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం ఇప్పటివరకు ఏం ఇచ్చిందనే దానిపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. భాజపాతో ఎలా వ్యవహరించాలనే అంశంపై చర్చించారు. వైకాపా అధినేత జగన్‌ ఇక్కడ దీక్షలు చేస్తే లాభం ఉండదని... దిల్లీలో చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కళా వెంకట్రావు, పయ్యావుల కేశవ్‌, కాల్వ శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com