టర్కీ దళాల చేతిలో 55 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతం
- May 08, 2016
టర్కీ దళాలు సిరియాలోని అలెప్పొ ప్రావిన్స్లో జరిపిన దాడుల్లో దాదాపు 55 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతి చెందారు. టర్కీ దళాలు ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించాయి. టర్కీ దళాలు శనివారం మూడు వాహనాలతోపాటు మూడు రాకెట్ ఇన్స్టాలేషన్లను కూడా ధ్వంసం చేశాయని జిన్హుయా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఉత్తర సిరియాలో సంకీర్ణ దళాలు వేర్వేరుగా జరిపిన దాడుల్లో దాదాపు 48 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు టర్కీ దళాలు 2,144 ఐఎస్ స్థావరాలను ధ్వంసం చేసి దాదాపు 807 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లైంది. ఇది అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపే దాడుల్లో భాగమని టర్కీ ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







