టర్కీ దళాల చేతిలో 55 మంది ఐఎస్‌ ఉగ్రవాదులు హతం

- May 08, 2016 , by Maagulf
టర్కీ దళాల చేతిలో 55 మంది ఐఎస్‌ ఉగ్రవాదులు హతం

టర్కీ దళాలు సిరియాలోని అలెప్పొ ప్రావిన్స్‌లో జరిపిన దాడుల్లో దాదాపు 55 మంది ఐఎస్‌ ఉగ్రవాదులు మృతి చెందారు. టర్కీ దళాలు ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించాయి. టర్కీ దళాలు శనివారం మూడు వాహనాలతోపాటు మూడు రాకెట్‌ ఇన్‌స్టాలేషన్‌లను కూడా ధ్వంసం చేశాయని జిన్‌హుయా న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. ఉత్తర సిరియాలో సంకీర్ణ దళాలు వేర్వేరుగా జరిపిన దాడుల్లో దాదాపు 48 మంది ఐఎస్‌ ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు టర్కీ దళాలు 2,144 ఐఎస్‌ స్థావరాలను ధ్వంసం చేసి దాదాపు 807 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లైంది. ఇది అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపే దాడుల్లో భాగమని టర్కీ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com