పాదచారుల ప్రమాదాల నిరోధానికి స్మార్ట్ సిగ్నల్స్
- April 11, 2023
దుబాయ్: ‘స్మార్ట్ పాదచారుల సిగ్నల్స్’ ప్రాజెక్ట్ రెండవ దశను దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ప్రారంభించింది. ఇందులో భాగంగా మరో 10 కొత్త ప్రాంతాలలో సిగ్నల్స్ ను ఏర్పాటు చేయనుంది. మొత్తంగా 2024 నాటికి స్మార్ట్ పాదచారుల సిగ్నల్ల సంఖ్యను 28కి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. మొదటి దశలో ఈ సిగ్నళ్లను అమర్చిన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, పాదచారుల భద్రతను ఈ వ్యవస్థ మెరుగుపరిచిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సెన్సార్ల ఆధారంగా స్మార్ట్ సిగ్నల్ లైట్ ఆపరేషన్ పనిచేస్తుంది. పేవ్మెంట్పై (వీధిని దాటడానికి ముందు), పాదచారుల క్రాసింగ్పై (దాటుతున్నప్పుడు) పాదచారుల కదలికను ఈ సెన్సార్లు గుర్తిస్తాయని, స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పాదచారుల భద్రతను గణనీయంగా పెంచుతుందని, సిగ్నల్ టైమింగ్ మెరుగైన నిర్వహణను నిర్ధారిస్తుందని ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విభాగం డైరెక్టర్ మొహమ్మద్ అల్ అలీ వివరించారు.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









