అధికారులు గరిష్ట శిక్షా రేటును సాధించడమే లక్ష్యంగా పని చేయాలి: సీపీ చౌహాన్
- April 11, 2023
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేర పరిశోధన మరియు నేర నిరూపణ ద్వారా 2023 జనవరి నెల నుండి మార్చి నెలల కాలానికి గాను గరిష్ట శిక్షా రేటు మరియు మంచి ఫలితాలు సాధించిన అధికారులు మరియు ఇతర సిబ్బందికి రివార్డ్ మేళా నిర్వహించడం జరిగింది.
తార్నాకలోని ఐఐసిటి సంస్థలో నిర్వహించిన రాచకొండ పోలిస్ రివార్డ్ మేళా కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ మాట్లాడుతూ నేర పరిశోధన మరియు దర్యాప్తులో పాల్గొనే అన్ని స్థాయిల సిబ్బంది మరియు అధికారులు నేరస్తులకు శిక్ష పడే ఒకే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.సామాన్య ప్రజల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టమని, నేరం ఎవరు చేసినా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి చట్ట ప్రకారం శిక్షలు పడేలా పనిచేస్తామని కమిషనర్ తెలిపారు.
శిక్షా రేటును పెంచే లక్ష్యంతో రాచకొండ కమీషనరేట్ పరిదిలో కేసుల దర్యాప్తు సమయంలో పాటించవలసిన విధానాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ క్రిమినల్ జస్టిస్ సిస్టంలోని అందరూ సమన్వయంతో పనిచేస్తే నేరస్తునికి తగిన శిక్ష పడుతుందన్నారు.అదే విదంగా పోలీసులు, ప్రోసిక్యూటర్స్ కలసి కేసుకు సంబందించిన విషయాలను చర్చించి నేరస్తులకు తగిన శిక్ష పడే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట శిక్షా రేటులో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లను మరియు కోర్టు డ్యూటి ఆఫీసర్ ల కృషిని అభినందించారు. అదే విదంగా NDPS కేసులలో కూడా SOP మరియు చెక్ లిస్ట్ లను అనుసరిస్తూ నేరస్తులకు తగిన శిక్ష పడే విదంగా చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కమీషనర్ V.సత్యనారాయణ తో పాటు రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని నాలుగు జోనల్ డి.సి.పి లు, క్రైమ్ డి.సి.పి, ఏ.సి.పి.సి.సి.ఆర్.బి,ఇన్వెస్టిగేషన్ అధికారులు, సి.డి.ఓ లు మరియు ప్రాసిక్యూషన్ తరపున డిప్యూటీ డైరెక్టర్ కస్తూరి,జాయింట్ డైరెక్టర్ రాజి రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









