జయంరవి నూతన చిత్రంగా తనీఒరవన్-2
- May 08, 2016
జయంరవి 25వ చిత్రంగా తనీఒరవన్-2 ఉంటుందని ఆయన సహోదరుడు, దర్శకుడు మోహన్రాజా వెల్లడించారు.ఆయనపై రీమేక్ చిత్రాల దర్శకుడన్న ముద్రను తుడిచేసిన చిత్రం తనీఒరువన్. జయంరవి కథానాయకుడిగా నయనతార నాయకిగా గత ఏడాది తెరపైకి వచ్చిన సంచలన చిత్రం తనీఒరువన్ .జయంరవి చిత్రాల్లోనే పెద్ద హిట్గా నిలిచిన ఈ చిత్రం పలు కోలీవుడ్లో ఒక సంచలన చిత్రంగా నమోదైంది.ప్రస్తుతం పలు భాషల్లో రీమేక్కు రెడీ అవుతున్న తనీఒరువన్ తాజాగా తెలుగులో రామ్చరణ్ హీరోగా పునర్నిర్మాణం కానుంది.ఇటీవలే దివంగత ప్రఖ్యాత నిర్మాత నాగిరెడ్డి అవార్డును గెలుచుకున్న ఈ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడుతోంది. సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి విజయవంతమైన చిత్రానికి రెండో భాగం ఉంటుందన్న ప్రశ్న చాలా మందిలో నెలకొంది. దానికి ఆ చిత్ర దర్శకుడు మోహన్రాజా ఇటీవల బదులిస్తూ జయంరవి 25వ చిత్రంగా తనీఒరువన్-2 ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆయన శివకార్తికేయన్ హీరోగా చిత్రం తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక జయంరవి భోగన్ చిత్రం పూర్తి చేసి మిరుదన్కు సీక్వెల్ చేయనున్నారు. దీంతో తనీఒరువన్-2 రూపొందడానికి ఇంకా చాలా సమయం ఉంటుందన్నది తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









