జయంరవి నూతన చిత్రంగా తనీఒరవన్-2
- May 08, 2016
జయంరవి 25వ చిత్రంగా తనీఒరవన్-2 ఉంటుందని ఆయన సహోదరుడు, దర్శకుడు మోహన్రాజా వెల్లడించారు.ఆయనపై రీమేక్ చిత్రాల దర్శకుడన్న ముద్రను తుడిచేసిన చిత్రం తనీఒరువన్. జయంరవి కథానాయకుడిగా నయనతార నాయకిగా గత ఏడాది తెరపైకి వచ్చిన సంచలన చిత్రం తనీఒరువన్ .జయంరవి చిత్రాల్లోనే పెద్ద హిట్గా నిలిచిన ఈ చిత్రం పలు కోలీవుడ్లో ఒక సంచలన చిత్రంగా నమోదైంది.ప్రస్తుతం పలు భాషల్లో రీమేక్కు రెడీ అవుతున్న తనీఒరువన్ తాజాగా తెలుగులో రామ్చరణ్ హీరోగా పునర్నిర్మాణం కానుంది.ఇటీవలే దివంగత ప్రఖ్యాత నిర్మాత నాగిరెడ్డి అవార్డును గెలుచుకున్న ఈ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడుతోంది. సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి విజయవంతమైన చిత్రానికి రెండో భాగం ఉంటుందన్న ప్రశ్న చాలా మందిలో నెలకొంది. దానికి ఆ చిత్ర దర్శకుడు మోహన్రాజా ఇటీవల బదులిస్తూ జయంరవి 25వ చిత్రంగా తనీఒరువన్-2 ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆయన శివకార్తికేయన్ హీరోగా చిత్రం తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక జయంరవి భోగన్ చిత్రం పూర్తి చేసి మిరుదన్కు సీక్వెల్ చేయనున్నారు. దీంతో తనీఒరువన్-2 రూపొందడానికి ఇంకా చాలా సమయం ఉంటుందన్నది తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







