అంబేద్కర్ 133వ జయంతి.. నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
- April 14, 2023
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. పార్లమెంట్ హౌజ్ లాన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి.. ఆ కార్యక్రమానికి హాజరైన బౌద్ధ భిక్షువులకు కూడా పుష్పగుచ్ఛం సమర్పించారు. బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో పాటు ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ముర్ము తన ట్విట్టర్లో సందేశం పోస్టు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, జ్ఞానానికి, మేధస్సుకు అంబేద్కర్ ఓ సింబల్ అని రాష్ట్రపతి ముర్ము అన్నారు. విద్యావేత్తగా, న్యాయ నిపుణుడిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజికవేత్తగా దేశ సంక్షేమం కోసం విపత్కరపరిస్థితుల్లోనూ పనిచేశారన్నారు. అణగారిన వర్గానికి విద్యను అందించి, వారిని ప్రధాన ప్రజాజీవన క్షేత్రంలోకి తీసుకురావాలని అంబేద్కర్ ప్రయత్నించినట్లు ముర్ము అన్నారు. ఆర్ధిక, సామాజిక సమానత్వం కోసం ఆయన కట్టుబడి ఉన్న తీరు అది ప్రజాస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తుందని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం







