రమదాన్ 20 రోజుల్లో 22 మిలియన్ల మంది భక్తులు

- April 15, 2023 , by Maagulf
రమదాన్ 20 రోజుల్లో 22 మిలియన్ల మంది భక్తులు

మక్కా: రమదాన్ 20 రోజుల్లో 22 మిలియన్ల మంది భక్తులు గ్రాండ్ మస్జీదులో ప్రార్థనలు రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల ప్రెసిడెన్సీ అధిపతి షేక్ డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ అల్-సుడైస్ వెల్లడించారు.  ప్రెసిడెన్సీ గ్రాండ్ మస్జీదు సందర్శకులు తమ ఆచారాలను సౌకర్యవంతంగా నిర్వహించడానికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రమదాన్ 23వ తేదీ రాత్రి గ్రాండ్ మస్జీదులో యాత్రికుల సంఖ్య 1.4 మిలియన్లకు చేరుకుందని ప్రెసిడెన్సీ పేర్కొంది. యాత్రికులకు సుమారు 57,6000 జంజామ్ వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామని, స్వచ్ఛంద సేవల నుండి లబ్ధిదారుల సంఖ్య 452,000 అని పేర్కొంది. 6,800 మంది వృద్ధులు, వికలాంగులు ప్రార్థనల్లో పాల్గొన్నారని, అదే సమయంలో 6,000 కంటే ఎక్కువ మంది ఉమ్రా యాత్రికులు తత్వీఫ్ సేవల (ఉమ్రా గైడ్ సేవలు) నుండి ప్రయోజనం పొందారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com