కల్తీ మద్యం తాగి 8 మంది మృతి
- April 15, 2023
పాట్నా: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్ లో కల్తీ మద్యం ఏరులైపారుతోంది. కొందరు వ్యాపారులు లాభాలే పరమావధిగా భావిస్తున్నారు. అక్రమంగా కల్తీ మద్యం తయారు చేసి, విక్రయిస్తూ ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు. కల్తీ మద్యానికి బలైన ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.
శనివారం (ఏప్రిల్15)న రాష్ట్రంలోని మోతిహారిలో కల్తీ మద్యం తాగి 8 మంది మృతి చెందారు. మరో 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2016 ఎప్రిల్ లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించింది. అయినా రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా తయారైన కల్తీ మద్యం తాగి అనేక మంది తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి







