దుబాయ్ అగ్నిప్రమాదం: పలువురిని కాపాడిన భారతీయ కార్మికులకు నివాళులు

- April 17, 2023 , by Maagulf
దుబాయ్ అగ్నిప్రమాదం: పలువురిని కాపాడిన భారతీయ కార్మికులకు నివాళులు

యూఏఈ: దుబాయ్ భవన అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పలువురిని కాపాడిన భారతీయ కార్మికులకు ఆ భవనం నుంచి బయటపడ్డ అద్దెదారులు నివాళులర్పించారు. ఏప్రిల్ 15 మధ్యాహ్నం దీరాలోని దురదృష్టకర ఘటనలో భవన నిర్మాణ కార్మికులైన సలియకోండు గూడు, ఇమామ్ కాసిం మరణించారు. వారు సురక్షితంగా బయటపడే అవకాశం ఉన్నా.. భవనంలోని అద్దెదారులను కాపాడేందుకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కారణంగా అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ పలువురు ఈ సందర్భంగా భారతీయ కార్మికుల త్యాగాలను స్మరించుకున్నారు. వారు వచ్చి తలుపుతట్టి విషయం చెప్పడంతోనే తన ప్రాణాలు మూడవ అంతస్తులో నివసిస్తున్న పాకిస్తాన్ ప్రవాస ముదస్సిర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు భారతీయ కార్మికులు మంటలను ఆర్పడానికి గ్రౌండ్ ఫ్లోర్ నుండి నాల్గవ అంతస్తు వరకు పరుగెత్తి చాలామంది ప్రాణాలను కాపాడి.. దట్టమైన పొగలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని పలువురు నివాళులర్పించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com